పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/530

ఈ పుట ఆమోదించబడ్డది

464

ద్విపద భారతము


సు భ ద్రా ర్జు ను ల వి వా హ ము


అట్టిసల్లాప వృత్తాంతమంతయును
నెట్టన మురవైరి నిజబుద్ధినెఱిఁగి
బలముఖ్య యాదవ ప్రభుల మొఱంగి
చెలువఁ గ్రీడికిఁ బెండ్లి సేయంగఁ దలఁచి,
తనచేయు కార్యయత్నము పాండవునకు
ననుజకు నతిరహస్యంబుగాఁ జెప్పి,
ఖ్యాతి నంతర్ద్వీపకాలకంఠునకు
జాతరవెడలంగ సమకట్టుటయును,
సాంబ సంకర్షణ సారణాక్రూర
శంబరారి సుధేష్ణ సాత్యకి బలులు
వెడలిరి కామినీవితతులుఁ దారుఁ;
గడు ద్వారవతిలోనఁ గావలివెట్టి,
తాను వారినిగూడి దామోదరుండు
పూనికఁజని శంభుఁబూజించి యచట
నైదారుదివసంబు లట్లున్న చోట,
యాదవేశ్వరుల నొయ్యన డాఁగురించి
హరి తనపురమునకరుదెంచి మిగులఁ
గరియానఁగైసేయఁ గాంతలఁబనిచి
యింద్రుఁదలంచిన, నింద్రుఁడాక్షణమె
సాంద్రవైభవ కళాచతురుఁడై వచ్చె;
గరుడ కిన్నర యక్ష గంధర్వపతులు
వరసప్తసంయమీశ్వరు లాదిగాఁగ
వచ్చిరి; శచియునువచ్చె; వెండియును
వచ్చిరి మునులు దుర్వాసుఁడాదిగను.
అమరులు విహరింప హరిరాజధాని
యమరావతినిబోలె నటవింతలేక.