పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/519

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; అష్టమాశ్వాసము

453


బొనర మజ్జనమాడఁబోవ , నర్జునునిఁ
గని యందు మౌనులు గదిసి యిట్లనిరి
“అనఘాత్మ, నీ వేలయరిగెదవందు :
నొనరంగ నూఱేండ్ల నుండియు నచట
నొగ్గమై మకరంబులుండుటవలన
డగ్గఱవెఱతు రాఢాకనెవ్వరును;
సోపద్రవంబులై చొరరాకయున్న
నేపుణ్యతీర్థంబు లేటికిఁ జెపుమ!
క్షితిఁ దాతగట్టినచెఱువైన నేమి!
చతురతమునింగి లోఁజావంగఁ దగునె!
మఱియుఁ దీర్థంబులు మహినెన్ని లేవు!
జరుగుము నీవందుఁ జననిందువలదు.”
అనుచు మౌనులు చెప్ప నర్జునుండనియె:
"మునులార, వినుఁడేను మునివృత్తి దాల్చి
సకలతీర్థంబులుఁ జరియింతుననుచుఁ
బ్రకటంపుఁబ్రతిన తప్పక చేసినాఁడ ;
వికటవైరులనెల్ల విదళించునాకు
మకరంబు లొకయొడ్డె! మర్దించివైతు.”
అనుచు నర్జునుఁ డేఁగి యందులో మొదలి
ఘనసరసిని నవగాహంబు సేయ,
విమలజలంబెల్ల విచ్చిపాఱంగఁ
గమలోత్పలంబులు గ్రక్కదలంగ,
మీనంబులన్నియు మిట్టిపడంగఁ,
దోన నేతేరంగఁ దోరంపునాచు,
వికటదంష్ట్రానన వికృతమై మొసలి
ప్రకటించి యాపార్థుఁ బట్టెఁ; బట్టినను,
సరసభవాబ్ధిలో జారంగఁదివియు
నురుకర్మమెడలించు యోగియుఁబోలె,