పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/494

ఈ పుట ఆమోదించబడ్డది

428

ద్విపద భారతము


"లోక పాలకులార, లోకజ్ఞులార ,
నాకుఁగల్గితి రిట్టినవకృపాయు క్తి ;
నేనెట్టిసుకృతినొ ! యెట్టిధన్యుఁడనొ !
పూని మీమూర్తులు పొడగంటి. "ననుచు
గీర్తింపఁగాఁ, దొంటి క్రియ రాజు దృష్టి
వర్తింపఁ జేసి యవ్వసుధీశుతోడ :
“ నింకఁ బాండవులకు నింతి నేవురకు
శంకింప కీనేర్తె జననాథ ! ' యనిన:
నేనుగృతార్థుండ ; నేనుధన్యుఁడను ;
బూని దేవతలకుఁబుత్రి నీఁగంటి
నెంతయుమీకృప ; నేనుమీవాఁడ ;
నింత చెప్పకయున్న నేమియు నెఱుఁగ."

ద్రౌ ప దీ క ల్యా ణ ము


అని మ్రొక్కి వ్యాసమహాముని ననిచి,
జనపతి లగ్న నిశ్చయము చేయించి,
చక్రధరాదుల సకలబాంధవుల
సక్రమగతిఁ బిల్వఁ జారులఁబనిచి,
కలయ నక్కాంపిల్యఘనపట్టణంబు
లలితవైఖరితో నలంకరింపించి,
యంత ముహూర్తదినాగమంబైన
నెంతయు సంతోష మిగురొత్త నృపుఁడు
జలముల మంగళస్నానంబుచేసి,
తిలకించి నగరికి ద్విజులరావించి-
పుణ్యాహవాచన పూర్వంబుగాఁగఁ
బుణ్యాంగనలచేతఁ బువ్వుఁబోఁడికిని
నలుగు పెట్టించి, కొట్నంబువాటించి,
యిలువేల్పులకుఁ బూజలిప్పించి వరుసఁ,