పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/459

ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమాశ్వాసము


శ్రీకర, శ్రితకల్పవృక్షావతార,
పాకశాసనభోగ, భవ్యసంయోగ,
నీలవర్ణునిమీఁద నిజమైన భక్తి
కీలుకొల్పెడువివేకీ చిత్తగింపు;
అక్కథకుఁడు శౌనకాదిసన్మునుల
కక్కథాసూత్రమిట్లని చెప్పఁదొడఁగె.
అంత నావైభవంబంతయుఁ జూచి,
శాంతితో హరిచూడ శమననందనుఁడు
కవలిరువురుఁ దాను గ్రక్కున లేచి
జవమొప్ప బోయెఁ బాంచాలి రానమ్మి.
విల్లు వంపఁగరాక విఱిగిన సిగ్గుఁ,
బల్లవాధర విప్రుపాలై నసిగ్గుఁ,
బ్రజలుమెచ్చక తమ్ముఁబలికిన సిగ్గు
నిజమనోవీథుల నిగుడఁ బార్థివులు
కలశాబ్ధి కల్పాంత ఘనపవనమునఁ
గలఁగినట్లు కలంగి కడుఁ దమలోన:

అసూయ చే ద్రుపదుపైనెత్తివచ్చిన రాజుల


విజయుఁడు పరాజితులఁ జేయుట



"మనలం బాంచాలుండు మాయలుపన్ని
తనయస్వయంవరోత్సవమని కూర్చి,
మంత్రసిద్ధుండైన మానవుచేత
యంత్రంబుసేయించి యటుగన్యనిచ్చె.