పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/454

ఈ పుట ఆమోదించబడ్డది

388

ద్విపద భారతము



మద్రేశుఁ డప్పుడు మదమునఁగదిసి
యద్రిఁబోలిన చాప మవలీలనెత్తి,
పెడగాల నడుమూది పెసరగింజంత
కడమగా నెక్కించి గ్రక్కున విడిచె
శిశుపాలుడును దనచేతికి విల్లు
వశముగానెత్తి భూవరులెల్లఁ జూడ
వడిఁ గొప్పునకు నారి వరిగింజయంత
కడమగా నెక్కించి గ్రక్కున విడిచె.
అంగాధిపతి కర్ణుఁ డార్చుచు వచ్చి
యంగద నాచాప మవలీలనె త్తి
'యక్కట ! వీనిపాలైపోదు' ననుచు
నక్కన్యవీక్షింప, నలువొప్ప మౌర్వి
విడువనిలావున వెండ్రుకయంత
కడమగా నెక్కించి గ్రక్కునవిడిచె.
హలపాణి మొదలైనయాదవులెల్లఁ
దలపడఁజూచిన, దై త్యారిగదిసి :
"విప్రులతోఁ బాండవేయులు వచ్చి
యీప్రసంగమునకై యిదె యున్నవారు ;
వారికై ద్రుపదుండు వరమునఁగన్న
వారిజాక్షికి మీరు వలదాసచేయ;
వినుతిఁ గన్నులుగల వేల్పులువోలెఁ
గనుఁ;" డని వారలఁ గదియనీఁడయ్యె.

అర్జునుఁడు మత్స్యయంత్ర మేయుట



మఱియెవ్వరును వింటిమాటాడవెఱచి
మఱుఁగులకొదుగుచో, మఘవాత్మజుండు
కరియూధములనుండి కరిరాజులేచు-
సరణి మహీదేవ సభనుండి లేచి