పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/440

ఈ పుట ఆమోదించబడ్డది

374

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము


ఎనయ నీ తాపత్యహితవశిష్ఠార్య -
ఘనమహాఖ్యానముల్ కడుభక్తి వినినఁ
జదివిన వ్రాసిన జనుల కెప్పుడును
బొదలు సంపదలును బుణ్యజాలములు.
గావున భక్తితోఁ గౌంతేయ, మీరు
భావింప నొకమునిఁ బరమతపస్విఁ
జేపట్టియున్న నీక్షితి నెంతవారు
నేపట్టునను మీకు నీడుగాలేరు."
అనుచు నవ్విధమున నంగారపర్ణుఁ
డనయంబు చెప్పంగ నర్జునుండనియె:
“అనఘ, నీ చెప్పినయట్ల చేసెదము;
వినుతాత్ముడగు నొక్కవిప్రుండు గలఁడె!"
అనుడు దివ్యుండువల్కు: “నాచార్యుఁగాఁగ
నొనరింపఁదగువిప్రు నుర్వీశ, వినుము;
ఉత్కచంబనుతీర్థమున్నది యెదుట;
సత్కాంతినిధులార, చనుఁడు మీరటకు,
ధౌమ్యుఁడున్నాఁ డందుఁ దాపసోత్తముఁడు;
సౌమ్యుఁడతండు మీచనవుచేకొనును.
ఆచార్యుఁగా మీర లతనిఁ బ్రార్థింపుఁ;
డాచుల్కఁదనమేఁగు నంతలో." ననిన
నంగారపర్ణుచే నంతయుఁ దెలిసి,
సంగతిఁ బాండవుల్ సంతసంబునను
అతనివీడ్కొని వేగ నాగంగదాటి,
ధృతివచ్చి యుత్కచతీర్థంబునందుఁ

పాండవులు ధౌమ్యునిఁ బురోహితుఁగా వరించుట



దపమున్న ధౌమ్యు నుత్తమకళారమ్యు
విపులవర్తనసౌమ్యు వేడ్కతోఁ గాంచి