పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/427

ఈ పుట ఆమోదించబడ్డది

360

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము


సకలభూతలమెల్ల శాసించునాకు
నొకకుఱ్ఱి నడిగిన నొప్పింపఁదగదె!
పెన్నిధియునుబోలెఁ బిదుకునీ మొదవు
నెన్నిభంగుల నుండనిత్తునే! యేను."
అనుచుఁ గోపంబున నాగోవుఁబట్ట
దనబలంబుల నెల్లఁ దడయక పనిచె.
అనిచిన, నానేన యాక్రేవుఁబట్టి
కొనిపోయి యావుకు గుఱుతుగాఁ జూపి,
యెలయింపరాకున్న నెంతయుబలిమిఁ
దలకొని వల్లెలఁ దప్పక దిగిచి
కట్టంగఁజూచినఁ, గనలి యా మొదవు
మెట్టి యావల్లెలు మిన్నక తన్ని,
పొట్టలుపగులంగఁ బొరిపొరిఁద్రొక్కి,
యట్టిట్టుగాఁదోలి యాబలంబులను,
జనుదెంచి భక్తితో సంయమిఁబలికె:
"ఇనతేజ! నన్నునుపేక్షింపఁదగునె!
బలిమి విశ్వామిత్రబలములుపొదివి
చలమున నాదూడఁ జావనీడ్చుచును
నన్నుబట్టుకపోవ నడచుచున్నారు;
క్రన్నన మాన్పవే! గాధేయుబాధ. ”
అనిన నూరకయుండ నమ్మౌనిచంద్రు
మనసు పూనికగాంచి మరలి యామొదవు
నెఱిఁగన్నుగ్రోవల నిప్పులుగ్రమ్మ
దఱమిడి క్షితిఁ గాలఁద్రవ్వి దిముచును,
స్ఫురితక్రోధంబునఁ బ్రోధంబులదర,
నరిమురి సేనల నదరంటఁదాఁకి,
చెక్కియుఁ జెండియుఁ జెదరఁదన్నియును,
ద్రొక్కియుఁ ద్రుంచియుఁ ద్రుళ్లడంచియును,