ఈ పుట ఆమోదించబడ్డది
352
ద్విపద భారతము
ఇటమీఁదఁ [1]గృతపురోహితులౌచుఁదిరుగఁ
బటుబుద్ధి వైరులు పగులంగఁగలరు;
కావున మీరలు ఘనపరాక్రములు
భావింపఁ బరధర్మభరితమానసులు
తాపసునోక్కనిఁ దావత్యులార,
చేపట్టుఁడబ్బెడు శ్రీయును జయము.
అనుడు గంధర్వున కర్జునుండనియె:
"వినుతాత్మ, నీచేత విననయ్యెవింత;
కౌంతేయవిఖ్యాతి ఘనత మై నుండ,
నెంతయుఁ దాపత్యు లేలంటివిపుడు?
వినయంబుతోడ నీవృత్తాంత మెల్ల
విన వేడుకయ్యెడు వినిపింపుమాకు."
అనుడుఁ గవ్వడిఁజూచి యమరుఁడిట్లనియె:
తపతీసంవరణము
“ఘనశౌర్య, యాకథ కడముట్ట వినుము;
భారతవంశాబ్ది పరిపూర్ణచంద్రు
డారయ సత్యధరాంచితాత్మకుఁడు
ధరణి నజామీఢతనయుండు ఘనుఁడు
వరయశోధనుఁడు సంవరణుండు తొల్లి
ధరణితలంబెల్ల ధర్మమార్గమున
నరయుచు, వేడ్కమై నతఁడొక్కనాఁడు
వాటంపుసేనలు వలనొప్పఁ గొలువ
వేఁటకై చనుదెంచి విపినంబులోనఁ
గంతునిదీమంబు గాంతాలలామఁ
గాంతి నారతినైనఁ గైకోనిబోఁటి
- ↑ బహుకృపాహేతివైతిరుగ (మూ )