పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/412

ఈ పుట ఆమోదించబడ్డది

346

ద్విపద భారతము


అర్జునుఁ డంగారపర్ణు జయించుట



నాగంగదాటి వారారసికొనుచు
ధీగతిఁ బార్థులేతేర, నారాత్రి
ననువుగఁ జీఁకటి నంగారపర్ణుఁ
డనియెడుగంధర్వుఁ డాండ్రునుదాను
జలకేళిసలుపుచుఁ జాలగర్వమునఁ
బలికె మీఁదెఱుఁగక పాండునందనుల :
ఎవ్వరురా! యోరి! యీ మధ్యరాత్రి
జవ్వనులును నేను జలకేళిసలుపఁ,
ద్రోవపెట్టుక మూరత్రోపుతనాన
వేవచ్చుచున్నారు! విధితప్పినదియొ !
కానరొ! నన్నునంగారపర్ణాఖ్యు;
నేనిందు విహరింతు నెదురెందులేక
ఇది కారణంబుగా నీగంగమడువు
విదితమై నా పేర వెలయుటవినరె!
మానరుగర్వంబు మానవులయ్యుఁ ;
గానరు మీకింత కావరంబేల!
జలజనేత్రలు నేను జలకేళి యిచట
సలుపుచునున్నాము చావకపొండు;
అంగారపర్ణుండ నమరాదులైన
సంగతి నేనన్నఁ జలియింతురెపుడు.
కొఱవిదాల్చితివేల కొఱవిదయ్యమవొ!
గిఱుకున మరలుఁడు కినియనట్లైన."
అనుఁడు నర్జునుఁడును హాసంబుచేసి:
"విను, నీవుపొమ్మన్న వెఱచిపోలేము ;
పోవభీతుఁడుగాదె ప్రొద్దువాటించు!
నేవేళయును మాకు నేకరూపంబు.