పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/400

ఈ పుట ఆమోదించబడ్డది

ద్విపద భారతము


అనిన సంతోషించి యసురపైఁ బవన
తనయు నియోగించి ధర్మసూతియును.
అప్పుడు సందేహ మాత్మలోఁ బాసి,
యుప్పొంగి పలికె వాయుజుఁడు బ్రాహ్మణుల :
"కడుపార నశనంబు గానమిఁ జేసి
కడు డస్సియున్నాఁడఁ గరుణాఢ్యులార!
తెండు నాకశనంబు తృప్తిగా." ననిన,
నిండారువేడ్కతో నెలఁతయుఁ బతియుఁ
గడవల వార్చినకమ్మనికూడు,
నెడపని బానల నివురువంటకముఁ,
గొప్పెర్ల నుడికిన గుజ్జుపులగము,
విప్పైన కాఁగుల విచ్చుపాయసము,
నేర్పడఁ బరఁటుల నెనసినపప్పుఁ,
బేర్పుననుడికిన పిండియుక్కెరయు,
ఖండశర్కరయును, గడవలకొలఁది
మండిగలాజ్యంబు మఱి మొదలుగను
గలిమియేర్పడఁదెచ్చి కదలికాపత్ర
ములఁబోయబోయ, భీముఁడు వానినెల్లఁ
గలిపి ముద్దలుచేసి కడుజఠరమున
నిలిపి యెంగిలి వార్చి, నెమ్మోము దెలియఁ
బోలఁగొండలవంటిపోతులు దివియఁ
జాలక పెనఁగునాశకటంబు వెంట
నల్లనవచ్చి, యయ్యసురయున్నెడకు
నెల్లేరువునఁబోక యెగువకుఁబోయి, (?)

                 బకాసుర వధ

రమ్మని యొక మాఱు రాక్షసుఁబిలిచి,
కమ్మఱ నయ్యేటి కఱతకు డిగ్గి ,