పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/386

ఈ పుట ఆమోదించబడ్డది

320

ద్విపద భారతము


మిమ్మునంజుడు చేసి మృదువుగా వండి
తెమ్మని నన్నుబుత్తెంచె మాయన్న;
ఆలిగా నన్నేలు; మట్లైన మిమ్ముఁ
బాలించుఁ; బట్టిచంపఁడు హిడింబుండు."
అనిన భీముడునవ్వి యానాతిఁబలికె :
"వినుము, రాక్షసులకు వెఱువమెన్నఁడును;
నిండారు సుఖమున నిద్రించువీరి
లెండని యేనేల లేపుదుఁ దొలఁగ!
వనశాంతిగా నేఁడు వధియింతు వాని
ననువెఱపింపక నాకారిఁదెమ్ము .
అనునంత, రాక్షసుం డతులకోపమునఁ
జనుదెంచెఁ దనపండ్లు సానపట్టుచును.
'వచ్చినపని యేలవదలితి' వనుచు
నచ్చెలియలిఁజంప నాయితం బైనఁ,
జెచ్చెర నది భీమసేనునిమఱుఁగుఁ
జొచ్చెఁ; జొచ్చిన వాయుసుతుఁడాదరించి,
కలహసన్నాహంబు గానరా లేచి,
చులకనిచూడ్కి నాసురవైరిఁజూచి :

భీముఁడు హిడింబాసురు మడియించుట



"యోరిరాక్షస, నీకు నుర్విలోఁ బులుగుఁ
బూరేఁడు నాహారమునకబ్బుఁగాక,
చిక్కునె పాండవసింహంబు లకట!
చక్కజత్తువుగాక సరి నెదుర్కొనిన,
నేలకు వ్రేగైన నిను బోరఁగనుట
చాలనుత్తమ.” మన్న సైరింపకసుర :
"మానవాధమ, నిన్ను మడియించుటెంత!
యేను జీరికిఁగొన నింద్రాదిసురల