పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/382

ఈ పుట ఆమోదించబడ్డది

316

ద్విపద భారతము


ఆ వెన్క పౌరజనావలి దూత
పావకవార్త చెప్పఁగ , విని విభుఁడు
కులిశంబు తాఁకునఁ గుధరంబుగూలు
బలువున ధాత్రిపైఁబడి మూర్ఛనొంది,
ధృతిగలవిదురుండు తెలుఁపగాఁ దెలిసి,
సుతులకు వాపోయె సురలెల్ల నవ్వ
అప్పుడు కృపభీష్ము లాచార్యముఖ్యు,
లప్పురిఁగలవార, లచ్చటిభటులు,
నంతఃపురావాసు, లఖిలకౌరవులుఁ
గుంతికిఁ దత్పుత్రకులకు వాపోవ,
రారాజు తనకేడ్పురాకయే శిల్ప
కారునకై యేడ్చెఁ గడుపాపబుద్ధి.
అంతఁ, 'బ్రమాదాగ్నినైనయాపదకుఁ
జింతింపవల,' దని సేనాధిపతులు
చెప్ప, నించుక ధైర్యచిత్తుఁడై నృపుఁడు
నొప్పుగా వారికి నుదకంబులిచ్చి,
శ్రాద్ధకర్మంబులు సకలంబుఁజేసి,
బుద్ధిలో నేప్రొద్దుఁ బొగులుచునుండె.
అంతనక్కడ భీముఁ డన్నదమ్ములను
గుంతినట్లెక్కించుకొని సాహసమున
నినరశ్మి దూరని యీరంపుత్రోవఁ
గొనలు మిన్నందిన కొండలత్రోవఁ
నేరుదాటఁగరాని యేఱులత్రోవఁ
ఘోరరాక్షసులుండు కుటిలంపుత్రోవఁ
నేతేర, నాఁకటనెరిసి పాండవులు
పాతాళమునఁ బ్రొద్దుపడనున్నవేళ
'నీరుపట్టయ్యెడు నిలుభీమ' యనిన,
నీరుపట్టినయట్టి నేల నాతఁడును