పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/255

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆదిపర్వము ; తృతీయాశ్వాసము.

189


జాకున్న, నాతనిసామర్థ్యమెఱిఁగి
భూ కాంతుఁ డామౌని భూమికి దెంచి ,
భూరి ప్రదక్షిణంబులుచేసి మ్రొక్కి
'నేరమి యోర్వవే నీవాఁడ' ననుచు
నుతియించి, యాకొఱ్ఱునోకుండఁ ద్రుంచి
యతనియల్కకుఁదప్పి యనిచిన, నరిగి
కుత్తుక నొకకొంత కోయంగరాక
బెత్తెడుకొఱ్ఱు నిల్చిన యాణెవలన
యానిమాండవ్యుఁడై యంత నామౌని
మానక తపముండి, మఱియొక్కనాఁడు
యమపురంబున కేఁగి యుమునకిట్లనియె :
"శమన, కొఱ్ఱెక్కింపఁజనున య్య నన్ను !
గలయంగ ధర్మాధికారిగా నిన్ను
నిలిపిన విధిఁగాక నిన్నాడఁగలదె!
ఏతప్పు నామీఁద నెన్నితి?" వనిన,
నాతఁడిట్లను: “ నన్ను ననఁబనిలేదు ,
ఎప్పుడుఁ బ్రాణుల నేఁ 'జొప్పఁగోసి
చొప్పఁగట్టినయట్టిచొప్పు' దీపింపఁ
గట్టుదు నిజనిజకర్మపాశముల ;
నిట్టుదూఱఁగఁ దగునే వట్టిదూఱు !
నీవు తూనీఁగల నీపిన్ననాఁడు
వావిరిఁ గొఱ్ఱులవైచితి గాన,
నాకర్మఫలమునే యనుభవించితివి;
మా కేమినా!" దన్న మాండవ్యుఁడలిగి:
‘యిలఁబుట్టి పదునాలుగేఁడులదాఁక
తలఁపంగనేరఁడు ధర్మంబునరుఁడు,
ఆలోనికర్మంబు లతనిఁ భావింపఁ
జాలవు; చేసితి సమయమేనిపుడు.