పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/240

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

ద్విపద భారతము


సత్యంబుతోవచ్చి సౌంజ్ఞ దై వార
సత్యవతీదేవి జనకున కపుడు
విభవంబుతో యుక్తవిధిఁ బెండ్లిసేయ,
నభినవోత్సాహుఁడై యపుడు పుత్త్రునకు
సరవిఁ గోరినదాఁక చావులేకుండ
వరమిచ్చి, యాసత్యవతియును దానుఁ
జిత్ర చిత్తజు కేళిఁ జెలఁగుచునుండి,
చిత్రాంగదునుని విచిత్రవీర్యునిని
బుత్త్రులఁగాఁగాంచి, పుత్త్రోత్సవంబు
ధాత్రి మెచ్చఁగఁ జేసి తనరఁబెంచుచును,
రాజ్యంబుచేసి, యారాజు గీర్వాణ
రాజ్యంబు కాలధర్మమునఁ బ్రాపించె.
అప్పుడు భీష్ముఁ డయ్యబల నూరార్చి,
తప్పక శ్రాద్ధముల్ తండ్రికిఁజేసి,
నవలీల సింహాసనంబు గైకొనక
యవనికి రాజుఁ జిత్రాంగదుఁజేసె.
చేసినచోట నాచిత్రాంగదుండు
వాసవునైన సత్వమునఁ గైకొనక :
"కరి గండభేరుండ కంఠీరవముల
గరిడికిఁగొనివచ్చి కడఁక నొంచుదునొ !
ఏఱులన్నియుఁ బూడ్చి, హేమాద్రి వెఱికి,
జారంగవిడుతునో జలధిలోపలను !
కాదేని, జలధిచక్రము వ్రక్కలించి
పోదునో శేషుతోఁబోరాడ! ననుచు,
నట్టిదిగా దేని, యవని సత్వాడ్యుఁ
బట్టి సాధింతునో బలమున 1” ననఁగ,
......... ......... ......... ......... ........ .........
........ .......... .......... .......... ......... .......