పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/238

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

ద్విపద భారతము


సాధింప, ఘనుఁడైన శత్రుఁడా లేఁడు !
బాధింప, నోడినపాపంబు లేదు !
విల్లు నేనును గల్గ విజయంబునీకు ;
నెల్ల కార్యములు నాకెఱిఁగింపు. " మనిన,
(ననువొప్పఁ దా వేట కరిగినలాగు,)
ఘనుఁడు యోజనగంధిఁ గదిసినలాగు,
రమణికి సుతుయౌవరాజ్య ముంకువగ
(నమరంగ దాశరా జడిగినలాగు,)
వలదని తా నంత వచ్చినలాగు,
లలిఁ బంచశరుఁడేయులాగుఁ జెప్పుటయు,
గురుభక్తి యాత్మలోఁ గొలఁదికి మిగుల
సురనదీతనయుండు క్షోణీశుఁబలికె :
"జాలరీఁడాడినచతురంపుమాట
యేలగైకొనవైతి! వేనున్న నేమి!
గురుహితం బెఱుఁగని కొడుకేమికొడుకు!
ధరణీశ, నీకోర్కి తలకూర్తువినుము ;
అందుఁబుట్టెడువాఁడు ననఘ, నీసుతుఁడు,
పొందుగా ధర యేలఁబోలదే చెపుమ!
తగ నేనపోయి, యాతని నొడంబఱచి
మగువఁదెచ్చెద"; నని మక్కువఁబోయి,
దేవలుఁగాంచి సుధీవరుఁడనియె:
"భూవరునకు నేల పుత్రినీవైతి?
నాచిత్తమెఱుఁగక నరనాథుఁ డపుడు
నీచేత సతి నంద నేరకపోయె.
ఆతఁడేమెఱుఁగు ! నీయాత్మజగాంచు
సుతునిఁ బట్టముగట్టి క్షోణియేలింతు;
నేనేలనొల్ల ; సూర్యేందులు సాక్షి ;
మానవేశ్వరునకు మగువని.” మ్మనిన,