పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/165

ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము; ద్వితీయాశ్వాసము

101


తపనున కగ్గితోఁ దప మాచరింప,
విపులాంశుఁడైన యవ్వేలుపునృపకు
ననలభానుసమానమగు విమానంబు
వినువీథి నెపుడైన విహరించుదారిఁ
గాంచి యాకాశమార్గమునఁ జరింపఁ,
గాంచనరుచులు లోకములెల్ల నిండ
నుపరిచరుండయి, యుర్వి నారాజు
నపరిమితానందుఁడై యొప్పుమిగిలె.
ఆరయ నొక్కయే ఱాతనిపురము
చేరువఁ బాఱు విశేషసంపదలఁ.
జూచు నొక్కొకమాఱు సుకుమారమీన
లోచన శుభగుణలోలదృష్టులను;
బలుకు నొక్కొకమాఱు బక చక్రవాక
కలహంస మధుకర క్రౌంచనాదముల;
మెలఁగు నొక్కొకమాఱు మృదుల మృణాళ
వలనహస్తవిలాసవైభవం బొప్ప;
వెలయు నొక్కొకమాఱు వీచిసంక్షోభ
కలిత కైరవ ఫేన కమలహాసముల;
వనవారణములు ప్రవాహమధ్యమున
మునుఁగఁ గుంభకుచాద్రులును గాననైన,
భయవతిగతిఁ బద్మపత్రాంబరమున
నయమతిఁ గప్పు నున్నతి నొక్కమాఱు;
నిగిడినయిసుకతిన్నియ పిఱుందునకు
దగుమొలనూలని తజ్ఞు లెన్నంగ.
దరి నోలిరాలిన తరుముకుళముల
యురుపంక్తి శోభిల్లు నొక్కొకమాఱు;
అరవిందములమీఁద నళిసమూహంబు
సరసవైఖరి వ్రాలి సందడించుటయు,