పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/120

ఈ పుట ఆమోదించబడ్డది

58

ద్విపద భారతము


హార పటీర నీహార మరాళ
శారదా నారద చంద్రికా కాంతిఁ
గైకొని, నిష్కళంకంబగుమేన
నే క్రియ నల్పు! నీవెక్కడగంటి!”
వన విని, కద్రువ యప్పు డావినతఁ
గనుఁగొని మఱియుఁ దక్కక యిట్టు లనియెఁ :
"దెలిఁగన్నుఁదోయిఁ జెందినయట్టి నలుపు
పొలుపున, శశిమేనఁబుట్టినకందు
లాగున, నీలవాలము శుభ్రతనువు
బాగుమీఱినయది పలుకు లేమిటికి!
సొలవక నిజముగాఁ జూచి, వాలమున
నలుపులేదని నీవు నాతోడ నొక్క
పన్నిదంబాడుము పంతంబుతోడ;
నున్న మాటలునుగా వొడఁబాటు మనకు"
ననవుడుఁ బ్రియమంది, యప్పు డవ్వినత
తనమాట గెలుపు తథ్యం బని కడఁగి:
"పడఁతి, నీచెప్పిన పన్నిదంబునకు
నొడఁబడియెద'. సన్న నుదరి కద్రువయు :
‘లలితాంగి, హయమువాలము శుభ్రమైన
దలగక యే నీకు దాసి నౌదాన;
నలుపు గల్గినయేని నాదాసి వగుము;
తలకొంటి; వీమాటఁ దప్పకు' మనిన
నట్ల కా నొడఁబడి, యప్పు డావినత :
యట్లైన నచ్చోటి కరిగి యాహయముఁ
గదిసి వీక్షింతము గాక ర' మ్మనినఁ,
జెదరక దాని వీక్షించి యిట్లనియె:
'వేడిమి మందమై వెలుఁగు భానుండు

వాఁడి యస్తాద్రిపై వాలుచున్నాఁడు;