పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/109

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము

47


విచ్చేసి, యంబికావిభుఁ డుగ్రభంగి
వచ్చునాగరళంబువలను వీక్షించి,
నవ్వుచు నప్పుడు నతపాణిపద్మ
మవ్విషమున కెదురగునట్లు చాఁపఁ,
బరికించి విరిదమ్మిపైవ్రాలు తేఁటి
కరణిఁ దద్విషము తత్కరముపై వ్రాలె.
అంగజాంతకుఁ డప్పు డవ్విషానలము
నంగదఁ గబళించి యడరి మ్రింగుటయు,
భువనంబు లలరె ; నప్పుడు వారలెల్ల
శివుఁ బ్రశంసించిరి చెలఁగి పల్మాఱు .
అవలీల వెండియు నసురులు సురలు
జవము దీపింప నాజలరాశిఁ దరువ,

ఐరావతాద్యుత్పత్తి



సురపతిప్రముఖులు చూచి మోదింప
గరిమతో నప్సరల్ గనుపట్టి; రంత
నైరావతము, దేవహయమును, గల్ప
భూరుహపంచకంబును, సుధాకరుఁడుఁ
ద్రిదశేంద్రధేనువు, దివిజరత్నంబు
ముదముతోఁ గౌస్తుభంబును దోడుతోడ
నుదయించె; హరికృపనొందినవారి
కొదవుసంపద లిప్పు డొదవినకరణి,
సొరిది శృంగారవిస్ఫురణ రెట్టించి,
కరమునఁ బూదండఁ గడఁక ధరించి,
కరుణరసం బర్థిఁ గనులధరించి
.........................................
పాలిండ్ల కొఱపుగాఁ బైఁట గీలించి,

లీలఁ బీదల మొరాలించి లాలించి,