ఈ పుట ఆమోదించబడ్డది
విరాటపర్వము - ఆ -1
39
వండెడువా రెల్ల వరుస నీయాజ్ఞ
నుండెడివారిఁగా నొరిమగా నుండు."
మని చెప్ప బకవైరి యత్యాదరమున
మనుజేంద్రుఁ జేరి నెమ్మది నుండె నంత.
అర్జునుఁడు పేడి యై విరటుని సభకు వచ్చుట.
ధీరతఁ బేడి యై దేవేంద్రుపట్టి
వారక పురుషభావము లేక యణఁచి,
సంకుల ఘనబాహు సౌందర్య మెడల
నంకించి, ఱవిక దేహము కాంతి మాన్ప,
చెలు వైనపవడంబు చెవుల సొం పణఁప,
అలకలు నుదుటి సౌ రణఁగించి యలమ,
మంచు పైఁ గవిసినమార్తాండుపగిది,
నించునివుఱు గప్పుని ప్పున్నయట్లు,
వేషంబు ధరియించువిష్ణుచందమున,
రోషంబు మానినరుద్రుకైవడిని
వాడుదేరినమోము ప్రాభవం బణఁప
వేడుకతో వచ్చె విభుఁ డున్న యెడకు.
వచ్చి యచ్చట నున్న వారిచూడ్కులకు
మెచ్చుగాఁ దనరూపుమేల్మిఁ గాన్పించి,