తృతీయాశ్వాసము
71
క. బేతాళునికథ ముందర
భూతాక్రోశంబెగాఁగఁ బుట్టిన దానం
గౌతుకము పొంది పౌరులు
నేతెంచిరి దారువర్మయింటికిఁ గలయన్.79
మ. ఎలమిం బొంది వివేకశూన్యమతి యై యేకాంతసౌధోపరి
స్థలభాగంబునఁ బాన్పుపైకిఁ జని రత్నప్రస్ఫురద్భూషణం
బులు వస్త్రంబులు పూఁతలుం దములముం బుష్పంబులున్ లోనుగా
లలితద్రవ్యము లెల్ల నా కొసఁగె మేలం బాడుచుం బ్రీతితోన్.80
వ. అనంతరంబు.81
తే. దారువర్మ రాగాంధుఁ డై తరుణిఁ గవియఁ
దివిరి పైఁబడఁ దలఁచినతివుట యెఱింగి
కదిసి వెసఁ ద్రెళ్లఁ ద్రోచి మోఁకాల గుండె
గ్రుమ్మి చంపితి లావు బీరంబు మెఱయ.82
వ. ఇట్లు చంపి కలుషితచిత్తయగు బాలచంద్రిక నూఱడంబలికి
వికలంబైన శృంగారము యథాపూర్వంబుగా నలవరించు
కొని మందిరద్వారంబు వెలువడి యగ్గలంబగు బెగ్గలంబు
భావించి.83
శా. రండీ! రాజుమఱంది నొక్కరుఁడు ఘోరస్ఫారగాత్రుండుక్రూ
రుం డై చంపెడు బెట్టుగట్టి యని యాక్రోశించి యేఁ బిల్చినం
దండం బై జను లెల్ల వచ్చి కని యుగ్యద్భాష్పులై రేసి బ్ర
హ్మాండం బొక్కట మ్రోయ నేడ్చి రచటన్ హాహానినాదంబులన్.84
వ. ఇట్లు రోదనంబు సేయుచు.85