పుట:దశకుమారచరిత్రము.pdf/7

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

ల - డలకు యతి

పన్నిజగాత్రముల్ కడువడంక(అష్టా. ప. 19.)

యతి లోపించుట

మగపంతంబును దక్కినన్ జనము లే మండ్రీ(ద్వాద. ప. 50)

అపశబ్దములు

ఉ. సుందరకుండు నేనును నసూయతనంబున(పంచమాశ్వాసము. ప. 45.)
ఉ. సొమ్మది చెంత యెంతయును జోద్యతరంబుగ(పంచమా. ప. 62.)

ఇంతకు మిగిలి దోషము లీగ్రంథమునఁ గానరావు.

ప్రాసస్థానమున తృతీయాస్థానము 59 పద్యములో, ఉజ్జయినికి ఉజ్జేని యనురూపము గానవచ్చుచున్నది. ఇది వ్యావహారికభాషారూపమో యని మాభ్రాంతి. ఇంత గొప్పగ్రంథములో నీస్వల్పలోపములు గణనీయములు కావు. ఆంధ్రభాషలో నిపు డపురూపములుగ నున్న శబ్దములు పెక్కులు ఈగ్రంథమునఁ గలవు. ఇందుఁ జాలవఱకు నిఘంటుస్థములు కాలేదు. కేతన దేశీయములతోఁ గవితఁ జెప్పువాఁ డగుటచే నితనికవితలో దేశ్యశబ్దములు విచ్చలవిడిగ నున్నవి. వాఙ్మయశోధకుల కాశబ్దములు సహకారులు కాగలవు.

కేతన రసోచితముగఁ బద్యములు వ్రాయుటలో మిగులనేర్పుగలవాఁడు. శృంగారరసమున నీకవి మిగుల మెలకువఁజూపును. స్త్రీవర్ణనమున నీకవి కచకుచాదివర్ణనముల కెడమీయఁడు. సంభోగశృంగారము గూడఁ గొన్నితావు లమనోహరముగ సభ్యముగ వ్రాసియున్నాఁడు. కేతన స్త్రీవర్ణనము మనోజ్ఞముగ నుండును. పోకడయు జవిగొలుపుచుఁ గ్రొత్తతీరుతీయములతో బింకముగ నుండును. చూడుఁడు.

సీ. భావజుపట్టంపుదేవి యై రూపున సడిసన్న రతివిలాసముల గెల్చి(సప్తమా. ప. 111)