పుట:దశకుమారచరిత్రము.pdf/62

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

55

     ధర్మరుచి వుట్టవలయు దుష్కర్ములు పడుపాట్లు చూపి మరలఁ
     ద్రోపు మనినఁ గొనిపోయి చూపునప్పుడు.15
సీ. ఎఱ్ఱఁగాఁ గాఁగిన యినుపకంబములతోఁ
                    గట్టినఁ గమగమఁ గమరువారిఁ
     క్రాఁగిన వెడఁదమంగలములఁ బొరఁటినఁ
                    బెల్లునఁ బెరపెరఁ బ్రేలువారిఁ
     గండలు దిగఁజెక్కి గంట్లను గొఱవులఁ
                    జూడినఁ జుఱచుఱ స్రుక్కు వారి
     గుదియలు గైకొని గుండెలు కుళ్లంగ
                    మోదిన మురముర ములుగువారి
తే. ముడియకట్టలక్రియఁ గట్టుపడినవారి
     నోలీఁ దలక్రిందుగా వ్రేలుచున్నవారి
     జూపి దుర్వర్తనములకుఁ జొఱకు మనుచుఁ
     జిత్రగుప్తుండు బుద్ధులు చెప్పి వుచ్చె.16
వ. ఏనునుం బ్రాప్తశరీరుండ నై యిమ్మహాటవిమధ్యంబున.17
క. ఒడ లెఱిఁగియు బలహీనత
     బడియుండిన విప్రవరుఁడు బాసటయై నా
     కడ నిల్చె నంత నట యేఁ
     బడిన తెఱం గెల్ల వినుచుఁ బాయనివగలన్.18
వ. మాతల్లిదండ్రులు వచ్చి న న్నెత్తికొనిపోవునెడ నాబ్రా
     హ్మణుండు కృతంబు విచారించి తోడనె చనుదెంచి ప్రాణ
     నిరోపణం బగునంతకు నిలిచి క్రమంబునం.19
ఉ. అక్షరశిక్షఁ జేసి వివిధాగమతంత్రము లొప్పఁ జెప్పి దో
     షక్షయకారణంబు లగు సచ్చరితంబులత్రోవఁ జూపి నూ

.