ద్వితీయాశ్వాసము
33
బైనట్లున్న యీగర్భంబు రక్షించుటయ సమస్తలోకరక్ష
ణం బగు మఱియును.40
మ. ఉదరస్థుండు సుతుండు వాఁడును జిరాయుశ్శ్రీయశస్సౌకుమా
ర్యదయాధైర్యపరాక్రమంబుల జనారాధ్యుండు లోకత్రయీ
హృదయాహ్లాదకరుండు నిక్క మని ని న్నేకాంతదుర్గంబులో
బ్రదికింపన్ మది గోరె భర్త యది దప్పం జూడఁగాఁ బాడియే.41
సీ. అనవుడు వారితోఁ బెనఁగుట కొల్లక
యప్పటి కొడఁబడి యర్ధరాత్ర
మందఱు నిద్రపరాధీను లగుటయు
నంత సముత్థశోకానలంబు
సైరింపఁజాలక చపలవిలోచన
యచ్చోటు వెలువడి నల్ల నరిగి
యొకమానికొమ్మున నుద్భంధనముఁ జేసి
కొనియెదఁగాక యే నని గడంగి
తే. వరుని యరదంబు చిక్కినవంక దైవ
యోగమునఁ జేరి మదిఁ బతి నునిచి మగధ
నాథ! యే నీకు భావిజన్మములయందు
ధర్మచారిణి యై యుండుదాన ననుచు.42
క. తనకట్టినపుట్టముకొం
గనుమానము లేక చించి యావృక్షముకొ
మ్మున నులిచి ముడిచి యురిలోఁ
జొనిపె మొగం బబల ప్రబలశోకముతోడన్.43