పుట:దశకుమారచరిత్రము.pdf/264

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమాశ్వాసము

257

క. మనము నను మరగి వెలిపడి
     తనమేన్ (జొరునొ చొరదొ యని) చాని మరలి చూ
     చినయట్ల కటాక్షము నా
     తనువునఁ గీలించె మదనుదర్పం బలరన్.34
వ. ఇట్లు సవిలాసావలోకనంబు సేయుచుం జని కన్యాంతఃపురం
     (బుం బ్రవేశించె నేను)నుం గుసుమశరశరజర్జరితచిత్తుండ
     నగుచుం గోశదాసుతోడం దదీయనివాసంబున కరిగి తత్సం
     పాదితసంప్రీతిపూర్వకస్నానభోజనంబు లిచ్ఛానురీ(తి మనో)
     హరంబుగాఁ జలిపి సాయంతనసమయంబున నతండునుం
     జంద్రసేనయు నాతో మధురసల్లాపంబు సేయుచున్నయెడ
     నమ్ముదిత వల్లభు(మేన నొయ్యారంబు)న నొరంగి విస్రంభ
     సుఖానుభవచరిత యైన దాని నుపలక్షించి యతం
     డి ట్లనియె.35
క. వనితా! యీచందమునన
     యనఁగిపెనఁగి యేను నీ(వు నాజీవితముం)
     బనుపడునట్లుగ దైవం
     బనుగ్రహము సేయునొకొ? దయాతత్పర మై.36
క. అనవుడు నాతనిపలుకుల
     కనుగుణముగ నిట్టు లంటి నబలా! (నా) యొ
     (ద్దను నిపు డొకమం) దున్నది
     కొను మిచ్చెద భీమధన్వు కూరిమి చెఱుపన్.37
క. ఆమందు మేనఁ బూయఁగఁ
     గోమలి! యాక్షణమె యాఁడుఁగ్రోతి వగుదు త