పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/58

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

59

ఉత్కళికావివరణము

ఉత్కళికయందు సుప్రసిద్ధ మగు కిరాతార్జునకథ వర్ణితము. పరమేశ్వరుఁ డర్జునునకు పాశుపశము నొసఁగు సందర్భమునఁ గిరాతవేషమును దాల్పుటయు నందు, వేదములు శునకములగుటయు శైవగ్రంథములయందు పలుచోట్ల వర్ణింపఁబడినది. పండితారాధ్యచరిత్రమున నీయవతారలీల పదునైదవదిగా వర్ణింపఁబడినది. ఈలీలలు సాంఖ్యమతానుసారముగా నిరువదియైదు తత్త్వముల కిరువదియైదు లీలలు పాల్కురికి సోమనాథుఁడు వివరించినాఁడు. నిశ్శంక కొమ్మన శివలీలావిలాసమున, శైవసంప్రదాయానుసరణముగ ముప్పదియాఱు తత్త్వములకు ముప్పదియాఱు లీలలు వివరించినాఁడు. కేవల రౌద్రాకారుఁడును, సుహారమూర్తియు నగురుద్రునిదయామయత్త్వమును విశదీకరించు నీ లీల ప్రాచీనకాలమునుండియుఁ గవులమనంబులు చూఱగొని శైవభక్తి స్థిరీకరణమునకుఁ గారణ మైనది. భారవి కీ. శ. 6 వ శతాబ్ధమున కిరాతార్జునకథ రచియించుట ప్రసిద్ధమే.

ద్వితీయావిభక్తి

ఉ. పామును-హారమున్ , నెలయుఁ బాపటసేసయు [1]నేఱు మల్లికా
    దామము, తోలుదువ్వలువు దట్టపుభూతియుఁ జందనంబు మై
    సామునఁ జాల నందముగ సన్నిధినేసినఁ జాడఁగంటి నే
    నామదిలోఁ గుమారగిరినాథుని శైలసుతాసనాథునిన్.

కళిక - విజయభద్రరగడ - జంపెతాళము

మఱియు వేలుపుటేటి - మౌళి నాఁగినవాని
నెఱయఁ గన్నపనోటి - నీటఁ దోఁగినవానిఁ

  1. బొట్టు -
        ముద్రితపుస్తకము