పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/56

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

57

వరలె జ్యోతిస్సిద్ధవటనాథుఁ డనఁగ
రమణఁ దత్పురుషవక్త్రము మహామహిమ
నమరెఁ దూర్పున త్రిపురాంతకుఁ డనఁగఁ
దనరె నీశాన్యవక్త్రంబు నూర్ధ్వంబు
నను మల్లికార్జుననామంబు దాల్చి.

మఱియుఁ బంచాననుఁడు చీఱు ననుటలో, తన కెదురుగ నున్నభక్తులనే కాక నలుదిక్కులయందును నాపై నున్నవారినిఁ గూడ విడువక పిలుచు నర్థస్వారస్యము గలుగుచున్నది.

హిమాలయము శ్రీశైలము మొదలగు శబ్ధము లహమర్థకము లైనను మహదర్థకములుగ వాడుట సంప్రదాయసిద్ధమే. పాల్కురికి సోమనాథుఁడు శ్రీశైలమును నగములలోఁ బురుషనగముగా నిట్లు సరసముగ వర్ణించినాఁడు.

'నగము లన్నియుఁ బెంటినగము లీనగము
పొగడఁ బున్నగమును బున్నాగములును'

మఱియు 'శ్రీనగచక్రవర్తి' యని పలుచోట్ల పండితారాధ్యచరిత్రమునఁ గలదు. కావుననే త్రిపురాంతకుఁడు శ్రీనగచక్రవర్తి యని మొదలిడినాఁడు. దేవాలయమున నాయాదైవతచిహ్నము లగుపతాక లుండుటయు, పతాకలు రాజలాంఛనము గావునను నిందు చక్రవర్తిపదము సార్థకమే యగుచున్నది.

కళిక వివరణము

ఆఱురేకులమంత్రకుసుమము. ఓంకారముతోఁ గూడిన