పుట:తెలుగు వాక్యం.pdf/39

ఈ పుట ఆమోదించబడ్డది

సామాన్య వాక్యాలు

25


d. అతను జ్వరంతో పరీక్ష రాసాడు.
e. అతను నా మీద కోపంతో మా యింటికి రాలేదు.

ఈ చివరి వాక్యానికి రెండర్థాలున్నాయి. ఒకటి : నామీద కోపంవల్ల మా యింటికి రాలేదు అని, రెండు : మా యింటికి వచ్చాడు కాని కోపంగా లేడని.

ఈ పై వాక్యాలలో కరణార్థం తప్ప మిగతా అర్థాలను బోధించే వాక్యాలను ఏక వాక్యాలుగా కాక, భిన్న వాక్యాల సంయోగం వల్ల నిష్పన్నమైనట్లుగా భావించ వచ్చు. చివరి వాక్యంలో ఉన్న ఆర్థ భేదం కూడా ఈ విషయాన్నే సూచిస్తుంది.

4. లో : అధికరణార్థం.

(54)

a. రచయితలకు తెలుగు దేశంలో సంపూర్ణ స్వేచ్ఛలేదు.
b. 1956 లో విశాలాంధ్ర ఏర్పడింది.
c. తెలుగు పత్రికలో ఆంధ్రపత్రిక పురాతనమైనది.
d. అతనికి ఆటలలో ఆసక్తి ఎక్కువ.

ఈ పైన ఇచ్చినవికాక వరకు , దాకా, గురించి, బట్టి, వంటి విభక్తి ప్రత్యయాలు చాలా ప్రయోగంలో ఉన్నై. కంటె, కన్నా అనే ప్రత్యయాలు తులనార్థంలో ఉన్నై. ప్రయోజనార్థంలో కోసం ఉంది. దేశకాలంలో భిన్న సంబంధాలను బోధించే ముందు, వెనక , తరువాత, కింద , పైన, పైకి, మీద, పక్క, వైపు, తట్టు, బయట, లోపల ఇట్లాంటివి చాలా పదాలు నామపదానికి చేరతై. వీటిల్లో కొన్ని మళ్ళీ విభక్తులను గ్రహిస్తాయి. పై నుంచి, పైకి, వెనక నుంచి , వెనక్కీ, ఇట్లాంటివి దేశకాలబోధక శబ్దాలకు నుంచి, కు చేర్చటంవల్ల ఏర్పడతై. గమనార్థక క్రియలున్నప్పుడు వాక్యంలో ఈ రకమైన రూపాలు నామం తరువాత ప్రయోగించబడతై. పైన పేర్కొన్న విభక్తులు ఆయా ధాతువుల ననుసరించి నామాలకి చేరతై. అవి గ్రహించే కారకబంధాల్ని బట్టి క్రియలను విభజించటం ఒక పద్ధతి.