పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/23

ఈ పుట ఆమోదించబడ్డది

4

తిరుమల తిరుపతియాత్ర



4. శ్రీకపిలతీర్థము.

ఈతీర్థము మిగుల ప్రాచీనము. ఇచ్చట భూలోకములోఁ బార్వతీ పరమేశ్వరులు కపిల మహాఋషికి ప్రత్యక్షమయిరి. ఈలింగము పాతాళములో సురలుచేతను, కపిలమహాముని చేతను బూజింపఁబడి జనుల నుద్ధరింప భూలోకమున కేతెంచెను. శ్రీవేంకటేశ్వర స్వామివారు వకుళమాలిక దేవిని శ్రీ పద్మావతిదేవి వివాహరాయబామునకు మొదటఁ బంపునపుడు నీతీర్థములో స్నానము చేసి కపిలేశ్వర స్వామివారి దర్శనము జేసికొని తమవివాహమును గుఱించి ప్రార్థించ వలెనని చెప్పిరి.

శ్లో|| అస్మాదేవరాన్మార్గదవరుహ్యగిరేస్తటాత్|
త్వంగచ్ఛాధః ప్రదేశేచకాపిలం లిఙ్గము త్తమమ్||
శ్లో|| తత్రాస్తే తీర్థ రాజా యః కపిలేశ్వరసన్నిధౌ|
తత్రస్నా త్వాయథాయోగ్యంమధర్థం తీర్థపుంగవే||
శ్లో|| కపిలేశ్వర మాసాద్యయాచ్చతాం పరమవ్యయమ్|
శ్రీనివాసేన బాలేనస దాకల్యాణ కాంక్షిణౌ||
శ్లో|| ప్రేషితాహంతర్ధం వై కురుమే భీప్సితం ప్రియమ్|
ఏవముక్త్వాశివం దేవి ! తతఃపద్మతటంగతా||

భవిష్యోత్తర పురాణము.

ఈతీర్థము తిరుపతికి ఒకటిన్నర మైలు దూరముననున్నది. శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనమునకు గాను కొండనెక్కక మునుపే ఈతీర్థమునకు తిరుపతినుండి యాత్రికులు వెళ్లి స్నానము చేసికొనెదరు. కొందఱు హిరణ్యము లేక తీర్థవిధి లేక తీర్థ