పుట:తాలాంకనందినీపరిణయము (49-64పుటలు).pdf/8

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

౫౬

తాలాంకనందినీపరిణయము


త్పుటము దిటమెల్లవిడి యం
తట నే నర్జునుఁడ ననుచుఁ దగఁ బలుకుటయున్.

240


మ.

మునుపే వాసవి రూపచిహ్నముల నాప్తుల్ జెప్పఁగా విన్నరీ
తిని యమ్మౌనికి గాననయ్యెనని సందేహింపఁగా తథ్యమ
య్యె నటంచు న్నునుసిగ్గుదొంతరలు నయ్యేణాక్షికిం దోడుగా
జని యభ్యంతరసీమఁ జేరె తను సంజాతాహతస్వాంతయై.

241


తే.

అన్న యెడ రుక్మిణి సత్య లన్ని చిన్నె
లెన్ని వెన్నునిచే మున్ను విన్నకతన
కన్నె కన్నుల విలుకాని బన్నములను
సన్నగిలనీక శిశిరముల్ గొన్ని బన్ని.

242


చ.

నరునకు భోజనోపకరణప్రముఖార్చన లాదరించి త
త్పరిణయకార్యసంఘటన బంకజనాభుఁ డొనర్ప మేచకాం
బరుఁ డిది విన్నచో సమయభంగ మొనర్చు నటంచు హస్తినా
పురమునకుం బ్రయాణమయి పోయె నిజాగ్రజుతోడ గూడుకన్.

243


సీ.

తన మంత్రివరులతోడను సుభద్రార్జునో
     ద్వహరహస్యములు యుక్తముగఁ దెలిపి
కేవలహితసాత్యకీయుద్ధవాదులఁ
     దగుకార్యముల జాగ్రతల నమర్చి
నేర్పు మీఱఁగ రుక్మిణీ సత్యభామల
     హిత శుభక్రమణసంగతి విధించి
కవ్వడితో లగ్నకాలంబు కిదె వచ్చె
     ద నటంచు నభయప్రదాన మొసఁగి


తే.

జనని యెడ నుంచి సుముహూర్తసరణి నెంచి
లలి సుభద్రార్జునులకు నలంకరించి
హితపురోహితు లతికుతుకత ధరించ
విధివిధాగతిఁ బెండ్లి గావించి మించి.

244