పుట:తాలాంకనందినీపరిణయము (49-64పుటలు).pdf/7

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 55


మున్ను ధనంజయు నెనయ మ
ది న్నెగడు మనోరథంబు దీరు నటంచున్.

237


సీ.

౧ అరుణపల్లవము లాదరణత నిడు తన
     యధరంబు సాటివి యన్న యట్లుఁ
౨ బుష్పముల్ దెచ్చి నేర్పుననిచ్చు తనసౌర
     భాంగము కివి సాటి యన్నయట్లు
౩ రసఫలంబులుఁ దెచ్చి యొసఁగును తనమధు
     రాలాపముల సాటి యన్నయట్లు
౪ నాహిమాంబువు పూజకని యొసంగును తన
     హాసంబునకు సాటి యన్నయట్లు


తే.

విమలపత్రపుటంబుల విధుశిలాది
పాత్రలను నించి, వినయసంభ్రమత మించి,
భక్తి సేవించి విజయుండు పతియుఁ గాఁగ
గోరియానారి రాజడదారిఁ జేరి.

238


సీ.

చారునఖద్యుతుల్ చరణారుణచ్ఛటల్
     గలసి కుంకుమగంధ మిల కొసంగ
మంజీరశింజినీరంజితధ్వని శుకా
     రావంబుతోడ బేరజము లాడ
వాల్గన్నుల మెఱుంగు వాఁడిచూపులు దిశా
     తతుల పువ్వుల వసంతంబు లాడ
పాణిపల్లవరుచుల్ పటుకంకణధ్వనుల్
     కలకంఠములను విందులకుఁ బిల్వ


తే.

ఘంటికాకాంచి లేఁగౌనునంటి మ్రోయ
బలుని యనుమతితోడ సపర్యఁ జేయ
మనసు భద్రముగా వేగమున సుభద్ర
భక్తితోఁ జేరె మాయాతపస్వికడకు.

239


క.

ఇటు లాకుటిలాలకనృప
జటి కభ్యర్చనలు సలుప సలుపఁగ మునిహృ