పుట:తాలాంకనందినీపరిణయము (49-64పుటలు).pdf/6

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54 తాలాంకనందినీపరిణయము


క.

గోపాలాగ్రణి యంతటి
లోపలనే బోయి పురములోపల జనులన్
రేపే రైవతకోత్సవ
మాపాదింపంగవలయునని చాటింపన్.

231


శా.

నందుం డాదిగ యాదవుల్ మిగుల నానాజాతిజాతంబు గో
విందప్రీతికరాంగనాజనము వేవేల్ రాజకన్యాజనం
బుం దేవేరులు రుక్మిణీప్రభృతులున్ భూషామణిస్పీతులై
యందందం జనుదెంచి రప్పురములో నాబాలగోపాలమున్.

232


శా.

ప్రీతిన్ రైవతకోత్సవంబునకు శౌరిన్ గూడి రాముండు దా
నేతేరం గపటత్రిదండికడ కెంతేనేర్పునం జేరి కం
జాతాక్షుండు వినమ్రుఁడై బలికె నోస్వామీ! కృప న్మీరలీ
చాతుర్మాస్యము మద్గృహంబుననె భిక్షం జేయ వేంచేయరే.

233


వ.

అని యక్కడలి బొడమిన జడుతపడతివడయుం డవ్వెడఁగు జడదారి యొడంబడునటుల మడతనుడువుల నుడివిన.

234


క.

అనుజుం డనుమాటకు బలుఁ
డనుమతిఁ గైకొనఁగ నుత్సవాంతంబున నే
తనుతనవారలతో న
మ్మునిఁ దోకొని బోయి భవనమున వనవాటిన్.

235


క.

నిలిపి, సుభద్రామణి న
య్యలఘునకు సపర్య సేయునటు నియమించెన్
బలదేవుఁడు మునులకు క
న్యలెకా శుశ్రూష జేయనగు వారనుచున్.

236


క.

అన్నల యనుమతి నీగతిఁ
గన్నియ శుశ్రూషజేయఁగా దొరకొనియెన్