పుట:తాలాంకనందినీపరిణయము (49-64పుటలు).pdf/4

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52 తాలాంకనందినీపరిణయము


దనదుహితాపత్యంబున
దనదు హితం బమరెనని ముదంబున జెలఁగన్.

220


చ.

అతనికి బభ్రువాహనుఁడు నా నొక నామ మొసంగి యర్జునుం
డతులితతద్ధరాతలమహాధిపతిత్వము వానికే దహో
త్రతవిధిగాఁ దదన్వయము రంజిలఁగా నిడి వారిచే సుహృ
స్టత సెలవందుచు న్వెడలె చయ్యన దక్షిణతీర్థయాత్రకై.

221


మ.

చనుచో పంచముఖప్రవాహ మగుచున్ సౌభద్రతీర్థంబు
జను దత్పంచకపుణ్యతీర్థములలో స్నానంబు గావింపఁ బో
యిన నందచ్చర లేవు రాది నొకమౌనీశోగ్రశాపాహతిం
ఘననక్రాకృతి బూని తైర్థికుల మ్రింగం జొచ్చుట ల్గాంచియున్.

222


క.

తనచే శాపవిమోచన
మును జేకురు టెఱఁగి తీర్థముల గ్రుంకిడి యం
తను వామకరముచే తొలి
తనువామకరములు దాల్ప దరిబడవైవన్.

223


చ.

చనుఁగవపొంకముం జిగురుచాయలవాతెఱలు న్నెరాతళు
క్కనుజిగిమేనులున్ సటువులైన పిఱుందులు ముద్దుమోములుం
గనుఁగవమేల్బెడంగులు చొకాటపుచక్కనిసోగముక్కు లిం
పునజెలువొందువేల్పుఁ బువుబోఁడుల రూపముదాల్చి నిల్చినన్.

224


క.

అంతట నక్కాంతలవృ
త్తాంతము నాద్యంతమరసి యతిమృదుభాషా
సంతతులన్ వీడ్కొలిపి య
నంతర మటవెడలి పశ్చిమాశాస్థలికిన్.

225


ఉ.

వచ్చి ప్రభాసతీర్థవనవాటికడన్విడి ప్రాణమిత్రుఁ డా
యచ్చుతుఁ బిల్వఁ బంప నతఁ డర్జును చిత్త మెఱింగి యిట్లనున్