పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/76

ఈ పుట ఆమోదించబడ్డది

73

28. మీర్జా బిర్జిస్‌ ఖదీర్‌

(1845-1893)

మాతృభూమిని పరాయిపాలకుల పెత్తనం నుండి విముక్తం చేసేందుకు పన్నెండు సంవత్సరాల చిన్న వయస్సులో అనునిత్యం నీడలా వెంటాడుతున్న ఆంగ్లేయ శత్రువును ఎదుర్కొంటూ స్వతంత్రపాలన సాగించిన అవధ్‌ రాజ్యాధినేత మిర్జా బిర్జిస్‌ ఖదీర్‌.

1845లో బేగం హజరత్‌ మహల్‌, అవధ్‌ చివరి నవాబు వాజిద్‌ అలీషా లకు జన్మించిన బిర్జిస్‌ ఖదీర్‌ అసలు పేరు మొహమ్మద్‌ రంజాన్‌ అలీ బహదూర్‌. ఆంగ్లేయులు అక్రమంగా చేజిక్కించుకున్న అవధ్‌ రాజ్యాన్ని తల్లి మారదర్శ కత్వంలో పునరాక్రమించుకుని స్వదేశీయుల అంగీకారంతో 1857 జూలై 7న ఆయన స్వతంత్ర పాలకుడయ్యారు. మాతృభూమి కోసం ప్రాణాలు త్యజించడానికి సిద్ధమైన ప్రజలు, స్థానిక నాయకులు, సిపాయీల సహకారంతో 1,80,000 మందితో కూడిన బలగాలను సమకూర్చుకున్నారు. తల్లి హజరత్‌ మహల్‌ సమర్థవంతమైన మార్గదర్శకత్వం, స్వదేశీయుల శౌర్యప్రతాపాల ఫలితంగా లక్నోనుండి ఆంగ్లేయాధికారులు పలాయనం చిత్తగించగా 10 మాసాల పాటు అవిచ్ఛిన్నంగా మీర్జా బిర్జిస్‌ ఖధీర్‌ పేరిట స్వతంత్ర పాలన సాగింది.

ఆ సందర్భంగా 1858 నవంబర్‌ 1న విక్టోరియా మహారాణి విడుదల చేసిన ప్రకటనకు ధీటుగా స్వదేశీయులలో ధైర్యాన్ని ప్రోదిచేస్తూ, విదేశీయుల కుయుక్తులను

చిరస్మరణీయులు