పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/72

ఈ పుట ఆమోదించబడ్డది

69

26. మౌల్వీ సయ్యద్‌ అల్లావుద్దీన్‌

(-1884)

దక్షిణ భారత దేశంలో బలమైన నైజాం సంస్థానంలో ఆంగ్లేయుల పెత్తనానికి వ్యతిరేకంగా ప్రజలను తిరుగుబాటుకు ప్రోత్సహించటమే కాకుండా స్వయంగా పోరాటంలో అగ్రభాగాన నిలచిన ధార్మిక నేతలలో మౌల్వీసయ్యద్‌ అల్లావుద్దీన్‌ ప్రముఖులు.

ప్రసుత ఆంధ్ర పదశ్‌ రాష్ట్ర రాజధాని, పూర్వ నెజాం సంస్థాన కేంద్రమైన హెదారాబాద్‌ ఆయన నివాసస్థలం. మౌల్వీ సయ్యద్‌ అల్లావుద్దీన్‌ జననం, తల్లి తండ్రుల వివరాలు, బాల్యం గురించి సమాచారం అందుబాటులో లేదు.

1857 ప్రథమ స్వాతంత్య్ర పోరాటం ప్రారంభం కాగానే హైదారాబాద్‌లోని నిజాం నవాబు కూడ బ్రిటిష్‌ వ్యతిరేక పోరులో భాగస్వాములవుతారని స్వేఛ్ఛాపిపాసులైన ప్రజలు, నాయకులు ఆశించారు. ప్రథమ స్వాతంత్య్ర సమరంలో చేరకపోగా తిరుగుబాటును అణిచేందుకు ఆంగ్లేయులకు అండగా నిజాం నిలిచారు. ఆ వాతావరణంలో రంగప్రవశం చేసిన మౌల్వీసయ్యద్‌ అల్లావుద్దీన్‌, తుర్రేబాజ్‌ ఖాన్‌ లాంటి ప్రముఖులతో కలసి హైదారాబాదు కేంద్రంగా తిరుగుబాటు కార్యకలాపాలను ముమ్మరం చేశారు.

నిజాం సంస్థానంలో భాగమైన ఔరంగాబాదులో తిరుగుబాటుకు శ్రీకారం పలికి అక్కడ నుండి హైదారాబాద్‌ వచ్చిన యోధులు చిద్దాఖాన్‌ ఆయన అనుచరుల విడుదల

చిరస్మ రణీయులు