63
23. ముహమ్మద్ షేర్ అలీ
(1842-1872)
స్వాతంత్య్ర సంగ్రామంలో ఉమ్మడి ఉద్యమాలు, వ్యక్తిగత పోరాటాలూ జమిలిగా సాగాయి. ప్రజలు ఏకోన్ముఖంగా సాగి నిర్వహించిన ఉద్యమాలలో బలమైన స్వేచ్ఛా కాంక్ష వ్యక్తం కాగా, వ్యక్తిగత పోరాటాలలో మాతృదేశం పట్ల ప్రగాఢమైన ప్రేమ, పరాయి పాలకుల పట్ల తిరుగులేని ద్వేషం, అత్యున్నత స్థాయి ధైర్య సాహసాలు బహిర్గతమయ్యాయి. ఈ మేరకు వ్యక్తిగత త్యాగాల బాటన నడిచిన యోధులలో మహమ్మద్ షేర్ అలీ ఒకరు.
ప్రస్తుత పాకిస్థాన్లోని పెషావర్లో 1842లో జన్మించిన మహమ్మద్ షేర్ అలీ చిన్ననాటనే పరాయి పాలకులకు వ్యతిరేకంగా వహాబీ యోధులు సాగిసున్న పోరాటాలతో ఉత్తేజితులయ్యారు. 1863లో పెషావర్ నుండి అంబాల వచ్చి స్థిరపడ్డారు. అంబాలలో జరిగిన ఘర్షణల కారణంగా 1868 ఏప్రియల్ 2న ఆయనకు ఉరిశిక్ష పడింది. అలీ మంచి ప్రవర్తన వలన ఆ శిక్షను కాస్తా ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు ద్వీపాంతరవాస శిక్షగా మార్చి 1869లో ఆయనను అండమాన్ జైలుకు పంపారు.
ఆ విధంగా అండమాన్ జైలుకు చేరుకున్నషేర్ అలీ వహాబీ ఉద్యమ కార్యకర్తగా దేశంకోసం, స్వజనుల కోసం ఏమీ చేయకుండానే జైలులో ఇరుక్కుపోయానని మదన పడ్డారు. వహబీ యోధుల మీద ఆంగ్లేయాధికారులు సాగిస్తున్న దామనకాండను ఆయన
చిరస్మ రణీయులు