పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/63

ఈ పుట ఆమోదించబడ్డది

60

అతడ్ని బంగ్లా నుండి బయటకు రప్పించేందుకు శతవిధాల ప్రయత్నించి, చివరకు ఆ బంగ్లాను స్వదేశీ బలగాలు చుట్టుముట్టి తగులబెట్టినా ఆంగ్లేయుడు మాత్రం బయటకు రాలేదు. బంగ్లాలోకి ప్రవశించి ఆ ఆంగేయుడ్ని, అతడి అనుచరుల్ని ఎదాుర్కొని, బంధించి బయటకు తీసుకురావటం చాలా ప్రమాదాకరం కావడంతో స్వదేశీ సైనికుల దళ నేతలు ఏంచేయాలన్న మీమాంసలో పడ్డారు.

ఆ సమయంలో ప్రమాదకరమైన ఆ సాహస కార్యాన్నినిర్వహించేందుకు పఠాన్‌ సలాబత్‌ ఖాన్‌ ముందుకు వచ్చారు. ఒక నిచ్చెన ద్వారా తిన్నగా ఆంగ్లేయుడు ఆయుధాలతో దాక్కొని ఉన్న బంగ్లా కప్పు మీదకు చేరుకుని, అతని అనుచరుల కంటబడకుండా అకస్మాత్తుగా బుర్టన్‌ ఎదుట ఆయన నిలిచారు. ఆ అనూహ్య సంఘటన నుండి తేరుకొని ఖాన్‌ పై బుర్దన్‌ దాడి చేయగా లాఘవంగా తప్పంచుకున్న సలాబత్‌ ఆ ఆంగ్లేయాధికారిని లొంగదీసుకున్నారు. ఈ సందర్బంగా సలాబత్‌ ఖాన్‌ చూపిన తెగువ, సాహసానికి ఎంతో సంతసంచి, సలాబత్‌ శౌర్యప్రతాపాలకు గౌరవ చిహ్నంగా, తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్నలాలా జై దాయాల్‌ భట్నాగర్‌ ప్రత్యేక జ్ఞాపికను బహు˙కరించారు.

1858 మార్చిలో మేజర్‌ జనరల్‌ రాబర్ట్స్ నాయకత్వంలోని సైనిక దాళాలు కోట సంస్థానాన్ని స్వదేశీ దళాల నుండి స్వాధీనం చేసు కున్నాయి. ఆ సమయంలో తిరుగుబాటు దాళాలతోపాటుగా సలాబత్‌ ఖాన్‌ గ్వాలియర్‌ వెళ్ళారు. ఆ తిరుగుబాటు దళాలు బ్రిటిష్‌ దళాలతో ఝుబియాపట్టాన్‌ (JHABIA PATTAN) అను చోట జరిపిన పోరాటంలో సలాబత్‌ ఖాన్‌ పాల్గొన్నారు. ఆ పోరాటం తరువాత ఆయన ఆంగ్లేయుల నిఘా నుండి తప్పించుకుని, లక్నో గుండా నేపాల్‌ పర్వతత ప్రాంతాలలోకి వెళ్ళిపోయారు.

ఆ అడవుల్లో తిరుగుబాటు యోధులతో కలసి రెండు సంవత్సరాలు గడిపారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకుల తొత్తులైన జంగ్ బహుదాూర్‌ లాంటి పాలకుల వలన ప్రతికూల పరిస్థితులు ఎదురుకావటంతో ప్రవాసం నుండి బయటపడి తిరిగి కోటా రాజ్యంలో ప్రవేశిస్తుండగా శతృ సైనికుల కంటబడ్డారు. కంపెనీ సేనలు అయనను చుట్టుముట్టిఅరెస్టు చేశాయి. ఆయన మీద రాజద్రోహం నేరారోపణ చేసి,ి చిత్రహంసలకు గురిచేశాక, విచారణ నడిపి 1861 ఆగస్టు 10న ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులు ఆయనకు మరణదండన ప్రకటించారు. ఆ శిక్ష ప్రకారం 1861 అక్టోబరు 23న కోటా లోని బ్రిటిష్‌ అధికార ప్రతినిధి నివాసం ఎదుట ఇతర తిరుగుబాటు యోధులతోపాటుగా పఠాన్‌ సలాబత్‌ ఖాన్‌ను బహిరంగంగా ఉరితీశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌