పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/40

ఈ పుట ఆమోదించబడ్డది

37

10.మౌల్వీ పీర్‌ అలీ ఖాన్‌

( 1820 - 1857)

మాతృభూమి కోసం బలికావటం తన భూమి పట్ల గల ప్రేమకు నిదర్శనం, అంటూ ఆంగ్లేయ ప్రబుత్వానికి వ్యతిరేకంగా ఆయుధాన్ని అందుకుని పోరుబాటన సాగిన యోధులలో మౌలానా పీర్‌ అలీ ఖాన్‌ ఒకరు.

1820లో బీహార్‌ రాష్ట్రం అజీమాబాద్‌ జిల్లా ముహమ్మద్‌పూర్‌లో పీర్‌ అలీ ఖాన్‌ జన్మించారు. తండ్రి మొహర్‌ అలీఖాన్‌. చిన్నతనంలోనే జ్ఞానతృష్ణ తీర్చుకోడానికి బయలు దేరిన పీర్‌అలీ అరబిక్‌, పర్షియన్‌, ఉర్దూ భాషలలో పాండిత్యం సంపాదించి, చివరకు పాట్నాలో పుస్తక విక్రేతగా స్థిరపడి స్థానికంగా ఉన్న విప్లవ మండలిలో సభ్యులయ్యారు.

1857లో ఆంగ్లేయ ప్రభుత్వం మీద తిరుగుబాటు ప్రకటితం కాగా, ఆ పోరులో భాగంగా ఆత్మగౌరవం, తిరుగుబాటుతత్వం గల స్వదేశీ పాలకులను, నాయకులను సమైక్యం చేసేందుకు ఆయన విఫలప్రయత్నంచేశారు. ప్రభుత్వాధికారి మౌల్వీ మహది ద్వారా అందిన 50 తుపాకులతో, శ్రీరంగపట్నం యుద్ధంలో టిపూ రూపొందించిన తెలుపు- నీలి రంగు పతాకాన్ని తమ తిరుగుబాటు పతాకంగా ప్రకటించి అనుచరులతో కలసి దానాపూర్‌ ఆంగ్లేయ సైనిక స్థావరం మీద దాడిచేశారు.

ఈ పరిణామాలతో ఆగ్రహించిన బ్రిటిష్‌ సైనికాధికారులు పీర్‌ అలీ దాళాన్ని

చిరస్మ రణీయులు