పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/32

ఈ పుట ఆమోదించబడ్డది

29

6. సయ్యద్‌ అహమ్మద్‌ బరేల్వి

(1786-1831)

భారత స్వాతంత్య్రసంగ్రామంలో భాగంగా అర్థ శతాబ్దిపాటు బ్రిటిష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం సాగించి స్వాతంత్య్ర సమర యోధులకు ప్రేరణగా నిలచిన వహాబీ ఉద్యమ నిర్మాత సయ్యద్‌ అహమ్మద్‌ బరేల్వీ.

16వ శతాబ్దంలో అరేబియా తత్త్వవేత్త అబ్దుల్‌ వహాబ్‌ ప్రారంభించిన శుద్ధ ఇస్లాం ధార్మిక సంప్రదాయ ఉద్యమం వహాబీ ఉద్యమం గా ఖ్యాతి చెందింది. ఆ ఉద్యమాన్ని ఇండియాకు పరిచయం చేసిన సయ్యద్‌ అహమ్మద్‌ 1766లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని రాయబరేలి జిల్లా బరేలి గ్రామంలో జన్మించారు. 1803లో విద్యాభ్యాసం పూర్తి చేసి, టోంక్‌ (Tonk) నవాబు అమీర్‌ ఖాన్‌ సైన్యంలో చేరారు. అమీర్‌ ఖాన్‌ పక్షాన పలు పోరాటాలలో, యుద్ధాలలో పాల్గొని రణరంగ ఎత్తుగడలలో మంచి ప్రావీణ్యం సంపాదించి సాహసోపేత యుద్ధ వీరుడిగా ఖ్యాతి గడించారు.

ఆనాడు సాగుతున్న్ ఇస్లామిక్‌ పునరుద్దరణ ఉద్యమాలకు మారదర్శ కత్వం వహిసున్న ప్రముఖ ఇస్లామిక్‌ తత్వవేత్తలు షా వలీయుల్లా (1703-62), అయన కుమారుడు అబ్దుల్‌ అజీజ్‌ (1746-1823)ల ధార్మిక సిద్ధాంతాల పట్ల అహమ్మద్‌ ఆకర్షితు లయ్యారు. ఆ సిద్థాంతాల సారాన్ని ప్రజలకు వివరిస్తూ మీర్‌, ముజఫర్‌నగర్‌, షహరాన్‌పూర్‌

చిరస్మ రణయులు