24
బ్రిటిటీషర్లకు దోస్తులుగా మారి హైదర్ అలీ మీద పలుమార్లు దండయాత్రలు చేశారు. ఈ దాడుల తొలిదశలో హెదర్ కొంత నష్టపోయినప్పటికి ఆ తరువాతి కాలంలో ప్రథమ, ద్వితీయ మైసూరు యుద్ధాలలో అరివీర భయంకరంగా వ్యవహరించి శతృవును పలుమార్లు చావుదెబ్బ తీసి ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాధికారులకు సింహస్వప్నమయ్యారు.
సర్వమత సమవర్తనుడైన హైదర్ అలీ, పాలకుడు ముస్లిం అయినంత మాత్రాన ప్రభుత్వం ఆ మతానికి చెందినది ఏ మాత్రం కాదని ప్రకటించి, అన్ని మతాల పట్ల సమాదరణ చూపారు. మతాలతో సంబంధ లేకుండా ప్రజలకు సమన్యాయం పంచారు. పలు మసీదులు నిర్మించిన ఆయన మఠాలు, పీఠాధిపతుల పట్ల ఎంతో ఔదార్యాన్ని చూపుతూ వాటి నిర్వహణకూ, పూజారుల, మఠాధిపతుల జీవన పరిస్థితుల మెరుగుదలకు ధన, కనక, వస్తు, వాహనాలను అందించటమే కాక ఆలయాల నిర్మాణాలకు ఆర్థిక సహకారం అందిస్తూ, ఆయా నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించారు.
ప్రజారంజకంగా పాలన చేస్తున్న హైదర్ అలీని రెచ్చగొట్టి ద్వితీయ మైసూరు యుద్ధానికి బ్రిటీషర్లు శ్రీకారం చుట్టారు. 1780 జూలై మాసంలో మహాసేనను తీసుకుని శతృవు ఆటకట్టించేందుకు కుమారుడు టిపూ సుల్తాన్ సమేతంగా బయలుదేరిన హైదర్ ఆర్కాటును పాదాక్రాంతం చేసుకోగా ఇటు టిపూసుల్తాన్ మద్రాసుకు 50 మెళ్ళ దూరంలో ఉన్న కంజీవరాన్ని సునాయాసంగా గెలుచుకున్నారు. ఆ విజయాలతో భయకంపితుడైన గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ అదనపు బలగాలను, అవసరానికి మించిన ధనమిచ్చి సర్వసైన్యాధ్యక్షుడు sir eyre coote ను హైదర్ మీదకు ఉసిగొల్పాడు. ఒకవైపున విదేశీ శత్రువుతో హెదర్ పోరాడుతుండగా పాలెగాండ్లు మలబారు నాయర్లు, నిజాం మద్దతుతో తిరుగుబాటును ప్రకటించగా హైదర్, టిపూ తలోదిక్కుగా సాగి వారిని ఎదుర్కొన్నారు. చరిత్రాత్మక ద్వితీయ మైసూరు యుద్ధం జయాపజయాలతో సాగుతుండగా వర్షాకాలం రావటంతో 1782 నాటికి యుద్ధమేఘాలు తాత్కాలికంగా అంతరించాయి.
ఆ యుద్ధం నాటికి హైదర్ అలీ వయస్సు 60 ఏండ్లు. ఆ వయస్సులో కూడా అసమానమైన వేగంతో, ఆయాసరహితంగా వందల మైళ్లు అశ్వరూఢుడై ముందుకు సాగుతూ పలు పోరాటాలు సాగించి అద్బుత విజయాలకు చిరునామాగా ఖ్యాతిగాంచిన హెదర్ అలీ మృత్యువుతో సాగించిన పోరాటంలో మాత్రం విజయం సాధించలేక పోయారు. ఆంథ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నరసింగరాయుని పేట వద్ద యుద్ధభూమిలో 1782 డిసెంబరు 7న హైదర్ అలీ ఖాన్ కన్నుమూశారు.
సయ్యద్ నశీర్ అహమ్మద్