పుట:కేయూరబాహుచరిత్రము.pdf/51

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

51

     దను విడువ రింక బహుచిం, తనములఁ బని యేల కాచెదం గా కితనిన్.333
వ. అట్లుంగాక.334
క. క్షీణకరుణచే బ్రాహ్మణు, ప్రాణము గొనఁదలఁచినట్టిపాపము మగుడం
     బ్రాణంబుఁ గాచి యతనకిఁ, బ్రాణం బీకున్న నెట్లు పాయఁగ నేర్చున్.335
వ. అని కృతనిశ్చయుండై.336
క. తనకడుపు మున్ను వ్రచ్చుం, డనుటయు నటుఁజేసి వార లందేమి యుఁ గా
     ననివారై యీతని వ్ర, చ్చిన యట్టుల కాదె యేల చెనఁటిగఁ జంపన్.337
వ. అనుచు నవ్విప్రు బంధముక్తునిం జేసి నిజేచ్ఛం జను మనుటయు.338
క. క్రూరులచే విడివడి సుత, దారాదులఁ గలసి యతఁడు ధన్యుం డయ్యెం
     జోరుఁడు వివేకమానస, చోరుఁడు నాకమున కరిగి సుఖియై యుండెన్.339
క. అవివేకచరిత మట్టిది, సవివేకచరిత్ర మిట్టిచందం బగుటన్
     సవివేక హీను సంగతిఁ, దవులఁగవల దాపదలకుఁ దప్పఁ దలఁచినన్.340
వ. అని మకరందిక యెఱింగించిన కథఁ గొనియాడి రిట్లు సుఖగోష్ఠి యొనరించి య
     మ్మువ్వురు సముచితవ్యాపారంబులకుం జనిరంత నిక్కడ.341
శా. దేవీరత్నము కిన్కతో, జనిన ధాత్రీనాథుఁ డుల్లంబులో
     నావిర్భూతమనోజతాపదహితుం డయ్యెం బరీహాసభా
     షావిన్యాసముచే దినంబు గడపం జారాయణుం డేగి ని
     ద్రావాసంబు భజించె రాజు కృతసంధ్యాముఖ్యకర్తవ్యుఁ డై.342
ఉ. అచ్చటనుండి నేర్పగలయట్టి యనుంగులయైన యింతులం
     బుచ్చిన రాక దేవి తనబోఁటికిఁ దెల్లమి గాఁగ నిల్చినన్
     వెచ్చని యూర్పు నించుచును వేదనఁ బొంచుచుఁ గన్ను మోడ్చుచు
     న్వెచ్చుచు సజ్జపైఁ దనువు వెమ్మగనేఁచుచు నీల్గి లేచుచున్.343
సీ. ఉండె నంతకుమున్న యుర్వీశతిలకుపై దేవి తప్పులువెట్టి పోవుటయును
     రాత్రి దా సజ్జకు రాకుండుటయుసు జెప్పినఁ గళావతి నతిప్రీతితోడఁ
     బసదనంబునఁ దన్పి భాగురాయణుఁడు లాటేశ్వరుపుత్రిక నెసకమెసఁగఁ
     గైసేయఁబనిచి యక్కన్యాశిరోమణి నటకుఁ దోడ్కొనియేగునట్లు చేసి
గీ. వలయు బుద్ధులు చెప్పిన నెలమి నదియు
     నీమృగాంకావలియు మున్న యెఱఁగికొనిన
     నెయ్యములకల్మి నోర్తోర్తు దియ్య మెక్కఁ