పుట:కేయూరబాహుచరిత్రము.pdf/45

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

45

     టోపముతో భేకంబును, వాపోవఁగఁ గఱచి చంపి వడి గ్రహియించెన్.260
వ. కావున.261
క. బలియుం డగుపగతున కెడ, గలిగి చనన్వలయు వాఁడు కార్యముకొఱకై
     కలయఁగ వచ్చినఁ బేల్వడి, కలపికొనఁగ వలరు బుద్ధిగలిగినమనుజుల్.262
క. అని యిట్లు సుమతి యెఱిఁగిం, చినకథ విని చాల సంతసిల్లి యిరువురుం
     కొనియాడి రప్పు డాసఖి, గనుఁగొని సుకుమారి కనియెఁ గడునెయ్యమునన్.263
క. ఏకాధివాస మైతిం, జేకొనుమేఖలకు హితము చెప్పుతలఁపునన్
     బోకుము నీ వెన్నఁడు నది, క కొనదు హితోక్తి తెలియఁగా లేదు మదిన్.264
క. అపగతవివేకులకు హిత, ముపదేశించుటయు వారినొందుటయును నీ
     తిపరుల కొప్పదు విహగము, కపిసహవాసమునఁ బడిన కాఱియ వచ్చున్.265
వ. అక్కథ యెట్లనిన.266
క. కానన మొక్కట బహుఫల, నూనక మొకమ్రాన నొక్కసూచీముఖమ
     న్వారమును దమలోపల, నూనిన నెయ్యమున నుండ నొకనాఁటి నిశిన్.267
క. మిన్నెల్ల నీలమేఘ, చ్ఛన్నం బై యొక్కవాన సాంద్రజలం బై
     మున్ను గురిసి తుది నీదయు, సన్నపుఁ జినుకులును విపినచరబాధలుగాన్.268
వ. ఎడతెగక యున్న సమయంబున వానరంబు చెలియగు నగ్గిజిగాఁ డొకనాఁడు.269
చ. మిడుఁగుఱుఁబుర్వు వెన్ను తగుమృత్తికపాదున నంటఁజేసి యొ
     క్కెడనఱలోన నిడ్డ నదియిమ్ములఁగ్రాలెడు రూపరేఖగా
     దడియని గూటిలోనఁ బ్రియదారయుఁ దానును నుండి సీతునం
     గొడుఁగుర వోయియున్న సఖుఁ గ్రోఁతిఁ గనుంగొని చాలఁ గుందుచున్.270
వ. నీడద్వారంబునకుం జనుదెంచి యతనితోడ.271
క. వడఁకెదు గదయ్య వానకు, నుడుకువ లే దయ్యొ రాత్రి యుగమునుగా కె
     న్నఁడు వేగునె యెవ్విధమున, నుడుగు న్నీబాధ యెట్టు లూరక నిలుతున్.272
క. ఎడలేదు నిన్ను రమ్మనఁ, గడుసన్నము నాగృహంబు కపివర పెక్కా
     డెడిదేమి యిట్టిపుట్టుగు, వడసినపుడ కాదె నాదు పౌరుష మడఁగెన్.273
ఉ. మచ్చిక రెట్టిగాఁగఁ దనమందిర మొంది యభీష్టవస్తువుల్
     నెచ్చెలు లెల్లఁ బొంది సుఖలీలఁ జరింపఁగఁ జేయలేమికిన్
     వెచ్చనియూర్పు నించికొని విన్నఁదనంబును బొంది వెవ్వగ
     న్వెచ్చినయట్లు సజ్జనుఁడు వేఱొకదుర్దశచేత నొచ్చునే.274