పుట:కేయూరబాహుచరిత్రము.pdf/23

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

23

క. అని పలికి పెలుచ నవ్విన, జననాయకమహిషి యాత్మసఖితో నడలం
     బని యేమి చెప్పు చయ్యన, ననవుడు నే డ్పుడిగి లేచి యవనతముఖి యై.125
వ. చారాయణుండు తనతోడం గపటసఖ్యం బొనరించి తన్ను దనబంధుజనంబుల స
     మ్ముఖమ్మున నుత్సవదర్శనకుతూహలంబున వచ్చినవారియెదుర సరివారిముందఱఁ
     బరిభవించిన తెఱంగు నీరెలుంగుతో వెక్కుచుం జెప్పి క్రమ్మఱఁ గన్నీరు మొగం
     బున నించుచుండె.126
ఉ. అప్పుడు దేవి భంగము వయస్యకుఁ జేసిన రాజుమిత్రుపైఁ
     దప్పు ధరాతలేశ్వరునితప్పుగఁ జూచి దరస్మితంబుతో
     నొప్పెడు మోముఁ జేఁదుడిచి యోరగఁ జేసి యపాంగభాగముల్
     ఱెప్పలఁ గప్పినం బుడమిఱేఁడు వడంకె మనంబులోపలన్.127
చ. వినయవివేకభూషణుఁ బవిత్రమహీసురవంశపోషణుం
     గనకనగేంద్రధైర్యు సవికారరూఢగుణాభిధుర్యు స
     జ్జనసతతోపకారహరిచందను బాంధవచిత్తరంజనున్
     మనుజశరీరదృష్టశతమన్యుని సర్వనరేంద్రమాన్యునిన్.128
క. సుశ్రేయఃప్రారంభు జ, నశ్రుతపౌరుషుని భావనారాయణదే
     వశ్రీపాదసరోజా, తాశ్రయనిజచిత్తషట్పదాన్వయమతికిన్.129
మాలిని. కవిజననుతకీర్తిం గామినీకామమూర్తిం
     బ్రవిమలగుణహారుం బ్రజ్ఞచేతోనిహారున్
     వివిధసుకృతయోగిన్ విష్ణుభక్తానురాగిన్
     భువనహితచరిత్రున్ బోలమాంబాసుపుత్రున్.130
గద్య— ఇది సకలసుకవిజనవిధేయ మంచననామధేయప్రణీతం బైన కేయూరబా
     హుచరిత్రంబునందు ద్వితీయాశ్వాసము.