పుట:కువలయాశ్వచరిత్రము.pdf/98

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

95

బారంగఁ గొదవడెనా యీరీతియు మంచిదని ప్రియంబునఁ బలుకెన్.55

సీ. ముడిపువ్వుటొత్తులు మూడువేళల దెచ్చియిచ్చువారల యిష్టమెల్ల గలిగెఁ

జనువుతో దారికట్టును మొనకట్టును దెలుపువారల మనువులు ఫలించె
నింతమాత్రమునకు నీ వేల నే బూనికొనియెదననివారి కోర్కు లొదవె
కైపంట వింతగా గైసేయు నూడిగంబులవారి యాప్తవిస్ఫురణ మించె
ఔర దాతలరాయ బ్రహ్మాయు ననెడు, వారికెల్లను ధనము లవ్వారియయ్యె
నొంటిపోట్లాట తత్తరంబునన మేని, వాంఛ యంజక వర్తించువారివలన,.56

సీ. బొక్కసంబుల బీగములు ఇచ్చి సొమ్మెల్ల వెఱ్ఱి యెత్తినరీతి వెచ్చబెట్టి

గెలిచిన నౌనెకా తలఁప వేఱొకటైన దయ యుంచుఁడనుచుఁ బెద్దలకఁ దెలిపి
వడిరోస మెత్తి పైఁబడ కెచ్చరించి చెంగట నిల్వుఁడని నేస్తకాండ్రఁ బలికి
చెల్లుగా మనసువచ్చిన పదార్థములెల్ల నరతన్వి తీరంగ ననుభవించి
యోర్వరిద్దరు తమలోన యెవనికొక్కొ, యీ చెలి యటంచు మదిలోన హెచ్చరించె
పొగలపెట్టెలు నునుధట్టిపొరల సరళ, తెల్లవారక మును బయల్ దేరుటయును.57

వ. అప్పు డత్యాశ్చర్యచర్యాధుర్యంబగు నక్కార్యంబు చారణులు విని కిన్నరు లాలించి

విద్యాధరులు చెవినిడి కిన్నరు లాకర్ణించి వెరగుపడం దదాప్తపరంపరానువాక్యంబుల
నెక్కడెక్కడ యని తత్తరంబునఁ బరువెత్తువారును నే మేమి యని యడిగిన వి
స్తరింపక జయంతనలకూబరులఁట యనుచుం బరుచువారును తారనిమిత్తంబున నెం
త పుట్టెం గంటిరే యెంత గయ్యాళి యనుచుం జనువారును నింద్రనందనునకు బందా
కోరైన యీరాజవదన కుబేరకుమారునకు లోనైన యప్పుడే వివాదంబు సిద్ధంబను
వారును వెలకొమ్మలమనంబులు నమ్మవచ్చునే యనుచు నరుగువారును నిట్టి యెడంబు
ట్టిన రసంబులు వారింప నెవ్వరితెరం బనుచుఁ దమయేలికలకు నెప్పటిసమాచారం
బు లప్పటికిఁ జీటులు వ్రాయుచుఁ గ్రక్కునం జనవలెఁ జుమ్మీ యనుచు వేగులవారి
నెచ్చరించుచుఁ బోవు నియోగులును ఘొల్లునఁ గేకలు వైచి కేరుచుఁ జంగునఁ దా
టుచు నేఁడుగదా వేఁడుక చూడఁగలిగెఁ గదా యనుచు గమకించు కోడేకాం
డ్రును గాయంబులు గట్టుటకు మందుసంచులు బుజంబుల వేలాడ బొజ్జలదరంజ
ను వేలుపువెజ్జులును చేటికావిదితతదీయవృత్తాంతంబు విని యమ్మక్క యీచక్క
నిదొరల కెక్కడనుండి వచ్చెనే యనుచు మేడ లెక్కి కనుఁగొను నవరోధగిరి ప
యోధరులును గన్నుంగని యెంతసిగ్గరివి తలయెత్తవే నంగనాచి యనుచు మూతు
లు పొడుచువారును నింకమీఁద మురిపెంబులు చెల్లునే యనుచుఁ దలఁ బంకించు న