పుట:కువలయాశ్వచరిత్రము.pdf/8

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

5

బలులు పెక్కండ్రు నృపతులు వెలసి రందు, వినుతి వహియించె గోవిందజనవిభుండు.23

క. వెలయుం దత్సుఁతుడై యతి, బలధృతియై తిమ్మధరణిపతి వైరిసతీ

కలితాంజనబాష్పఝరీ, హలహలికాంజనధరీకృతాఖిలగిరియై.24

సీ. విడు పైఁటచెఱఁగు నే వెఱతు గాయము మాననిమ్మని ఛాయ యెంతేసి వేఁడ

నశ్విను ల్మందులకై ద్రోణగిరికి నిచ్చలుఁ బోవుకతన వేసరుకొనంగ
నిరుపద్రవముగామి నిలువరాదని రమాపతి వేఱపాలెంపుఁ బట్టు వెదక
నాయయ్య కిదియపాటాయంచు నలసింహికాతనూభవుఁ డౌడు కఱచికొనఁగఁ
జెలఁగి తొగకొమ్మమొగ మింత చేసికొనఁగఁ, దిమ్మనృపశౌరి దినదినోద్భిన్నవైరి
వారబహువారభేదనవర్ధమాన, మైనరవిమేనిపెనుగండి మానదయ్యె.25

క. ఆరసికమౌళి ముద్దుఁగు, మారుఁడు శరజాతవృత్తి మనియె న్గనియెం

దారకగర్వనివారక, సారకనత్కీర్తి లక్కజనపతి ధరణిన్.26

సీ. ఆర్కవంశమువారమని దుర్ణివారులై గుడిసెకై జిల్లెడు గొట్టఁబోరు

హరిభ క్తిగలవారమనుచు సన్నద్ధులై వేఁటకై సింగంబు వేఁటఁబోరు
కడువిరక్తులమంచుఁ దడవిండ్లు గైకొని యేచి పుల్గులమీఁద నేయఁబోరు
భార్గవగోత్రసంభవులమంచుఁ దలంచి గట్టులపైఁ దరుల్ మెట్టఁబోరు
సంగరాంగణసంగతశౌర్యధైర్య, ధుర్యు లక్కమహీపాలవర్యధాటి
కాపలాయితమత్తప్రతీపభూపు, లడవిలోఁ బాతకాఁపులై యలరునపుడు.27

గీ. అమ్మహైశ్వర్యసంపన్నుఁ డంబకాగ్ర, చంచలీకృతదుర్మనోజాతుఁ డగుచుఁ

గలితమైన సదానందకారి గరిమఁ, దనరు తిరుమలదేవి నుద్వాహమయ్యె.28

గీ. ఆ తిరుమలాంబయందు లక్కావనీశుఁ, డతులరవితేజుఁ దిప్పభూపతి బిడౌజు

లక్కనృపవర్యుఁ దిమ్మవిలాసధుర్యుఁ, గృష్ణనృపచంద్రు నారాయణేంద్రుఁ గనియె.29

క. వారలలోపలఁ దిప్పధ, రారమణుఁడు వెలయు రాజరా జనఁగఁ గృపో

దారుండు లబ్ధకవచ, స్ఫారగుణాపార్థవైరిబాణక్షతియై.30

సీ. పద్మము ల్మైనిండఁ బర్వ నుస్సురుమంచుఁ దలయూఁపఁదొడఁగె వేదండపాళి

కమలము ల్క్రేవలఁ గదియ వెల్వెలవాఱి కాలూఁదలేఁ డయ్యె వ్యాలభర్త
యజ్ఞరేఖాప్తిపై నమర నిద్దురమాని నిలిచినచో నిల్చెఁ గులధరాళి
వనజాతములచ్చాయ దనరి కంపనమొంద రోమోద్గమముఁ జెందెఁ గ్రోడమౌళి
తమ్ముఁ బెడవాసి వసుధాసుధాకరాస్య, క్రొత్తవలపంటి ననవంటి కొమరువంటి
నీటుకాఁడైన యలతిప్పనృపతిఁ జేర, విరహగరిమంబు తమయందు వీలుకొనఁగ.31