పుట:కువలయాశ్వచరిత్రము.pdf/40

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

37

నడచి పడువారును క్షతంబుల వెడలు ప్రేవుల నూడనీక యదిమి కదనోన్మాదం
బున దుప్పటులు బిగియించి యెదిరించువారును గెలుపుగాయంబులఁ బడియుం
డియు మండిగాలిడుకొని కైదువులు జడిపించుకొనుచు రౌద్రాకారంబున ను
న్నవారును గళ దెలిసి నలుదిక్కులుం బులుకుపులుకునఁ జూచి మానధనంబునం
దొడిగినచల్లడంబు లక్కడక్కడఁ జించుకొనువారును బ్రాణనిర్యాణసమయంబు
నందును నిజస్వామివిజయంబె విచారించువారును నడుగకమున్న యభ్యర్ణంపుమడుఁ
గుల జలంబు దెచ్చి దప్పి నివారించు బంటుల ఋణంబులు దీర్చుకొని వారితో నా
త్మీయులకు వలయు బుద్ధు లుపదేశించువారును దెట్టువలుగట్టియున్న క్రొన్నె
త్తురులు గనుంగొని నెత్తురుకళవట్టి తమకుఁదామ వ్రాలువారును దొలఁగ క
క్కడక్కడ భద్రపఱచిన ముదురుమానిసులకతంబునఁ బోఁగూడక నమోనమో
యనుచున్నవారును గ్రించుఁదనంబునఁ గొంచెపాటి చెనకులఁ దెచ్చికోలు వేదన
లంబడి తన్నుకొనువారును గలిగి సంగ్రామంబు గావున నధికధామంబును జన్యం
బు గావున భూతక్రియామాన్యంమును సమరతలంబు గావున ధమోజ్జ్వలంబు
ను నై యాసమీకంబు సమాకులితనాకలోకం బయ్యె మఱియు.148

గీ. పోరఁ బెనువానగా రక్తపూర మొలుకు, కాయములు పూను భూతనికాయనమలరెఁ

గేళిగతి నిల్చు రణభద్రకాళిమ్రోల, వరలు పన్నీరుతిత్తులవా రనంగ.149

సీ. గ్రుడ్డులు మిడికించుకొని దప్పి కిమ్మను దమవారి నొక్కబేతాళమౌళి

గొంతు మ్రోచిన దిగుల్కొని నోర వ్రేలిడి క్రక్కు నొక్కపిశాచికావిభుండు
అన్నువట్టినను మ్రాగన్నుతోఁ బొర్లాడు నేలపై నొకడాకినీవరుండు
కక్కుర్తి మెక్కి యగస్త్యమంత్రము వల్కు బొడ్డు నంటుచు నొక్కభూతనేత
తనివితీఱినత్రేఁపు విన్నునకునిక్క, శతపదాల్ ద్రొక్కు నొక్కనిశాచరుండు
పలలరాసుల బువ్వంపుబంతివిందు, మించుఁబోఁడులతో నారగించువేళ.150

గీ. ఒక్కని కళేబర మరసియుఁ దగఁదినక, వీనిఁ బడవైచె నాతఁ డావీరుఁ డనుచు

గా దనుచుఁ గుమ్ములాడునక్తంచరాళి, యెంతకార్యంబు దమ కేమి యెవ్వఁ డైన.151

క. ఒకవీరవరుకబంధము, నకు మూఁగి పిశాచికాగణము భూతావే

శకమున నది యెగిరినచోఁ, బకపక నవ్వించె నులికిపడి డాకినులన్.152

సీ. శౌనకమౌని విశ్వామిత్రుతోఁ దెమ్ము పన్నిదం బనుచుఁ జేపట్టి తిగువ

శుకుఁడు[1]
  1. ఇక్కడఁ గొంతగ్రంథభాగము మాప్రతిలో లేదు.