పుట:కువలయాశ్వచరిత్రము.pdf/38

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

35

గీ. అలసినట్టి జనులు తేలి యవలి కరుగ, వేఱుతుటుములు పెనుబోటు భేరి మ్రోఁత

లమర నరుదెంచి దొడ్డకయ్యమున నవియుఁ, బడలనంతయుఁ గని దండి బారుగదిసె.134

క. అందఱు నిట్టలు వచ్చిన, యందము గనుపట్టెఁ దద్రణాంభోనిధి దాఁ

టం దెప్ప గట్టఁబూనిన, చండంబున నలుగు లరిదిచాయల నీనన్.135

గీ. ఒకఁడు కుంతానఁ బగవాని యుగము గ్రుమ్మ, వెంటనే యాతఁ డీటెచే వెళ్ళఁబొడువ

వెలసె నిద్దఱు నిల్చిన నిలుపు కచన, కాళికై కావడించిన కాను కనఁగ.136

క. పగవాని గ్రుచ్చి యీటిని, నెగనెత్తె నొకండు రణమహిందుములమునం

గగనమున నుండి వ్రాలెడు, ఖగపాళుల కంది యిచ్చు కైవడి మెఱయన్.137

క. జముదాడి నొక్కవీరుఁడు, విమతేంద్రుం బొడిచి వాఁడు వెస నిజభుజసా

రాము మెచ్చి చల్లుననకుం, కుమబలెఁ దద్రక్తమున నిగుంభితుఁ డయ్యెన్.138

క. అలుగునగ చూపువేళం, దలతలమను నింతసోఁకిన న్మగవానిం

గళదాఁకఁ బెనఁగు నొకమొ, క్కలపు దొరకరాసి నీటుకత్తియ యగుటన్.139

చ. గళము లూడ్వనెత్త కరిణీపతి చేరినఁ దేజిపావడన్

మొగమునఁ గప్పినూకి యొకమొక్కలపు న్నెఱరౌతు కుంభము
ల్పగులఁగ నేసిన న్వెడలెఁ బట్టము వెంటనె మౌక్తికావళు
ల్మగఁటిమి మెచ్చి చేరి జయలక్ష్మి సుమాంజలి యిచ్చుకైవడిన్.140

మ. బలియుం డొక్కపటానిరౌతు తనబాబానూకుచు న్రెండువీ

థులమాస్టీలత లల్కరాసిలతికం దుండించుచుం జుట్టిరా
నలరెం దత్తనువు ల్ధరంబడుట భూతాజ్ఞప్తిచే వెట్టిమో
పులు నేలం బడవైచి కూలఁబడు కాపుల్వోలె నప్పట్టునన్.141

క. నరపతి యంతట దనుజుల, యురువడిఁ గని చేయివీవ నుగ్రాకార

స్థిరతం గరులకుఁ గరులున్, హరులకు హరు లరదములకు లరదము లెదురన్.142

సీ. రాజ నాచెయి చూడు గ్రాసంబు ఋణముగాఁ జేయుదునే యంచుఁ జేరువారు

లలితంపుఁ దులశిప్రోగులు ద్రుంచి నోటిలో వైచికొంచుఁ దురీన వచ్చువారుఁ
గలనిలోఁ బొలియుటకంటె భాగ్యమ్ము లున్నవే యంచుఁ దెగి యనికఱుమువారు
నేలినవానికట్టెదుటనే పనికివచ్చుటగదా మేలని చొచ్చువారుఁ
బూర్వవైరంబు మాని సొంపులు జనింప