పుట:కువలయాశ్వచరిత్రము.pdf/37

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

కువలయాశ్వచరిత్రము

జొరవ చేసికొని శంకరుఁ డిచ్చకాలకు సఖుఁ డౌకుబేరుపైఁ జాడి చెప్ప
గడియకుడుక మునుంగుటఁ గని గురుండు, తెల్లవాఱెడునని పఱతెంచి పలుకఁ
గటికవారెల్ల దొరలు వచ్చుట వచింప, దనుజపతి లేచి యొకభద్రదంతి నెక్కి.125

గీ. కోటకావలికై యాప్తకోటితోన, నీవు నీ వని నియమించి నిలిపి తక్కు

రక్కసులు వారణంబుల రథములందుఁ, దురగములయందుఁ బొడసూపి తోడనడువ.126

సీ. చెకుముకి యగ్గి జానకితాటిమిడుఁగురు ల్గొఱలెడునది యెలగోలుమూఁక

వెదురుమల ల్చేర్చువిధమున నీటియ ల్దాల్చి పొల్చినయది దండిబారు
లిరుగోపులను దుమ్ము లెగయించునదిసిలేముస్తీబుగల కాలుమొకరిపౌజు
కొమ్ముకత్తుల మెఱంగుల వెల్లపానడ ల్గొనునది మస్తేనుఁగులచయంబు
సురగిరీంద్రంబుపిల్లలై చుట్టు నున్న, కనకరథముల నడుమ సింగాణి విల్లు
దొనలు మెఱయంగఁ దేజిపైఁ దోఁచువాఁడు, ధారుణీశ్వరుఁ డని వేగువారు దెలుప.127

చ. అరిగి మహాభయంకరతరాహనదోహలబాహవప్రతా

పరుచులు వోలు చెందిరపుఁ బావడచేఁ బుఱచేయి వీచి సు
స్థిరమతి నంపపెట్టుకొలఁదిం గజరాజము నిల్పి దానవే
శ్వరుఁ డెలగో లొనర్పఁగ నిశాచరుల న్నియమించి నంతటన్.128

చ. అలరుమొగంబుతోఁ గువలయాశ్వము నిల్పి నరేంద్రమౌళి తూ

పులపొదిదోయి వీపుకడఁ బొందుపడం బిగియించి మించురా
చిలుకలవ్రాఁతగచ్చుపనిసింగిణి గైకొని యెక్కువెట్టి సే
నలు తనసన్న గోరఁగ గుణధ్వని చేయుచుఁ జేయి వీచుచున్.129

క. పేరెములు వాఱి యొక్కక, చేరువ గుంపగుచుఁ దారసిలి యిరువాగుం

ఘోరపుబాణపుఁ జువ్వలు, బోరనఁ గొనవిఱిచి వైవఁ బొసఁగె న్మొదటన్.130

క. కొనద్రుంచివైచు బాణపుఁ, బెనుజువ్వలు పాఱి నేలపెట్టుగఁబడుజీ

బున సిగిడి కాలుసేతులు, దునియలు గావించి ముందు దురుసున నడిచెన్.131

క. ఉయ్యాలచేరు లనఁగా, నయ్యిరువాగులును దఱిమి యటు దిరుగుచు బ

ల్కయ్య మొనరించి యించుక, డయ్యక యొడ్ల పయిఁ బెట్టుటయు నట్టియెడన్.132

చ. ఒకపరి యొడ్లలోని రిపు లుగ్రత వైచు తుపాకిమందుగుం

డ్లకు వెనుదీయ కాఁగి యచటంబడునాప్తులఁ గోలుగొట్టనీ
య కనిఁ బెనంగి యంతఁ దరియం బడి యచ్చటివారలం గకా
పికలుగఁ దోలి యొడ్లు విడిరించిరి చేరువకాండ్రు మెచ్చఁగన్.133