పుట:కువలయాశ్వచరిత్రము.pdf/30

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

27

నిలిపితివి తండ్రిపద్దులు, వెలసితి విటు లతనికన్న విక్రమగరిమన్73

చ. అనుచు బహూకరించుసమయంబున నూరకయుండి యుండి యం

జనరుచి పుంజమంజిమకచగ్రహ మైనతమంబు పర్వె తో
డన హరిచందనప్రతిభటం బగువెన్నెల దోఁచె వెంటనే
కనఁబడియె న్నిరస్తకనకస్తబకస్తుతు లైనయెండలున్.74

క. అది చూచి మేదినీవర, భిదురీ మృదురీతి గా దభేద్యము గంటే

యిదిసుమ్ము దనుజశాంబరి, గదిసె న్బరిపూర్తి దీని ఖండింపు మిఁకన్.75

గీ. విజయ మగు నీకు గెలువు మోవీరవర్య, యనుచు గాలవుఁ డాడుచో నచటఁ గలుగు

పారిగాంక్షులు కటకటం బడుచు శిష్యు, లంటి చనుదేర నచ్చోటి కరుగుదెంచి.76

క. మునిచంద్ర వచ్చి మావెం, టనె వచ్చునటంటి వీతఁడా నృపుఁ డేమ

య్య నరేంద్ర కన్నులారం, గనుఁగొంటివే వీని యవదగాకితనంబుల్.77

ఉ. అయ్యయొ మాకు దండమిడినంత ఫలంబు నరేంద్రచంద్ర యీ

దయ్యముతోడి జాగరము దాఁటఁగఁ జేసి శుభమ్ము లిమ్ము లే
వయ్య కొమాళ్ళతండ్రి వయి యాశ్రితరక్షణ దుష్టశిక్షణా
క్షయ్యదయాపరాక్రమవిశాలుఁడవై మనుమయ్య యిమ్మహిన్.78

సీ. చదువుకొన్నామంచు జట చెప్పుచుఁ బరీక్షఁ గొని వరింపు మటంచుఁ బెనఁగువారు

ననుజూచె ననుజూచె ననుచు రిత్తకురిత్త జవలు వట్టుక పోరఁ దొడఁగువారు
బులకము ల్మైనిట్టపొడువంగ వడి నోరు దెఱచి మైమైఁ జూడఁ దిరుగువారు
జేసన్న మటజంబుచెంతకు రమ్మని మునుదొంగమొక్కులు మొక్కువారు
నగుదు రీయయ్యలెల్ల వాఁ డదరుగడగ, గులుకుగుబ్బలు దళుకుఁజెక్కులు మిటారి
మొలకనవ్వులు గలమోము ముద్దుగులుక, మాయపుం డెక్కులాడియై డాయునపుడు.79

సీ. అటు మొన్న భార్గవజటికి శౌనకమౌని కొకవాదుమై నొంటకుండఁ జే సె

మొన్నఁ బారాశర్యముని యోటరాఁ గూఁత లెగయించి వెరవేఁకి యెత్తఁ జేసె
నిన్న విశ్వామిత్రునికిఁ దందరఘటించి యొడ లెఱుంగక పడియుండఁ జేసె
నేఁడు మార్కండేయునికి సివం బెత్తించి తల వీడఁగ బయళ్ళ మెలఁగఁ జేసె
మానవాధీశ విను మింతమాత్రమైన బ్రతుకవచ్చును వీనిచేఁ బడినపాట్ల
కొల్లఁబాటయ్యె మాకునిందునికి యేమి, చెప్పెడిది మాతపంబు నీ చేతి దింక.80