పుట:కువలయాశ్వచరిత్రము.pdf/26

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

23

కని ముహురున్న మన్మృదుముఖంబున సారెకు సారెకు న్వలా
మొనరుచు దీనిఁ గైకొని జయోన్నతిఁ జెందుము రాజనందనా.43

చ. అనిన మహాప్రసాద మిపు డానతి యిచ్చితిరేకదా యిఁకం

గనఁబడఁ దెల్ప నేమిటికిఁ గార్యముఖంబున స్వామిచిత్తమే
ననుచు నదేల కావలసినం దనుజు న్వధియింపఁ జాలరే
ననుఁ గరుణావలోకనమునం మిముఁ జేయఁగఁగాక నచ్చటల్.44

సీ. చాయలొందిన దంచు సంతరించిన వాలుచూరకత్తి పరీక్ష చూడఁగలిగె

తరతరంబులనుండి దాఁచినారని విన్న కఱకునేజామేలు గాంచఁగలిగె
ననిలోనఁ దనుఁ గాచు నని చెంచు లర్పించు కేడెంబువాడి వీక్షింపఁగలిగె
పందెమొగ్గినఁ గూడఁ బగఱ గెల్చుకటారి యిది దీని వగ నిశ్చయింపఁగలిగె
స్వామి మీకతమున నిట్టి చౌకపనికి, మీకు వేంచేయనలయునే మీగృహమున
కరుగురెంచితి రందుల కనుట కాదు, పదము లెక్కడ బడలెనోకద మునీంద్ర.45

చ. అని మహిజాని యూడిగపుటాప్తులఁ గన్లొని దండు చాలుగాఁ

బనుపుఁడటంచుఁ బల్కి మునిపాలకమాళికిఁ గేలు మోడ్చి స
ద్వినయవినమ్రుఁడై నిలిచె వెంబడిగా నరుదెంతు మున్నుగాఁ
జనుఁడని వీడుకొల్పి హరి సాహిణి నీవశమంచుఁ బల్కుచున్.46

చ గడెలు పదాఱు చెల్లె ననఁగా విని కట్టికవారు మ్రోత గ

న్పడ నవధారు దేవ జతనాయన గద్దియు డిగ్గి యందఱి
న్విడిదల కంపి మౌళిసరణిన్ హరిగ ల్నిగుడంగ జెట్లు వెం
బడి కయిలా గొసంగఁ దెలిపావలు మెట్టి యొయార మేర్పడన్.47

శా. కోణేవాకిట వారి నిల్పి కులుకుంగుత్తంపుఁ జన్గుబ్బ లే

జాణల్కొందఱు కుంచెగిండి యడపా ల్సాగింప వాణీరణ
ద్వీణాపాణులు కొంద ఱారతిగము ల్ద్రిప్పంగ గక్ష్యాంతర
శ్రేణు ల్దాటి నృపాలుఁ డంతిపురముం జేరెం బ్రమోదంబునన్.48

వ. అంత.49

క. దనుజాతఖండనోద్ధతిఁ, జను మనుజాధిపు ప్రతాపజాతము మునుముం

గనిపించె ననుచు జనము, ల్గనుఁగొన మార్తాండమండలం బుదయించెన్.50

క, ఇటువలె వేజన నరపతి, పుటభేదనమునఁ బ్రయాణబోధకభేరీ

పటహఢమామీకాహళ, పటురవములు నిద్రలేపి పయనము దెలుపన్.51