పుట:కువలయాశ్వచరిత్రము.pdf/24

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

21

ధీరలగువార లూరును బేరు నడుగ, నెంచి యేమంద మని విచారించికొనఁగ
నిలిచె జిలిబిలి జడదారి చెలులఁ జేరి, మచ్చుకప్పెడుదారి నమ్మాయదారి.29

సీ. పనిలేనిపని గిఱుక్కున మోముద్రిప్పుచోఁ జెక్కు పైఁ గమ్మ తళుక్కు మనఁగ

సిగ్గునఁ దలవంచి చిఱునవ్వు నవ్వుచోఁ గెలకులఁ జికిలివెన్నెలలు గాయఁ
గెంగేలఁ బైఁటచెఱంగు బిగించుచో నిద్దంపుఁజనుఁదోయి నిక్కు దోఁపఁ
బలికించువారి మోములు దేలఁజూచుచో వాలుఁజూపులు పూలవాన గురియ
నిలుచు నొఱపును గరువంబుఁ దెలియనీక, పలుకుబెళుకును మొగమునఁ దొలఁకు దెలివి
యొడలియఁడకువనడలోన బెడఁగువారి, కన్నుఁబ్రామఁగ మృగియున్నకడకు నరిగె.30

క. వడి నరిగి రవికి రుచి నే, ర్పెడి మిడిగ్రుడ్డులును జిక్కిరించిన చెవులు

న్బొడవున నెత్తినవాలము, నడరఁగ నొకసింగమై మృషాంగన నిలువన్.31

చ. కనుఁగొని మౌనికాంతలు కకాపికలౌ మది నమ్మ చెల్లఁగా

యనుచు మిళద్భరీకృతభయంబు గళత్కబరీచయంబు న
త్యనుపద వనావిలమృగాంగనమున్ ముహురుల్చలద్గురు
స్తనమునుగా రయంబున యదాయదలై పఱతెంచి తెల్పినన్.32

క. కటకటఁబడి మఱి నే న, క్కుటిలక్రమగతులు గురియ గుఱి యెవ్వఁడొ యం

చటునిటు నారసి వీఁడని, పటుయోగజ్ఞానగరిమ భావించుటయున్.33

సీ. చిరదయాగాంభీర్యపరిఖకు తాఁబేలు నవధైర్యవప్రంబునకు సురంగ

ఖలజాతిగుణలతావళికిఁ బ్రాఁకుడుచెట్టు నిష్ఠురత్వంబను నిమ్మ కెరువు
క్రూరవాచాకాలకూటంబునకు వార్ధి దాక్షిణ్యవన్య కుద్దామదనము
ప్రకటితాత్మజ్ఞానరవికి దుర్దినవేళ మూర్ఖతాస్థితికి సామ్ముఖ్యకరము
కోప మిటు లౌనొ కాదొ యో భూపవర్య, యది యపుడు వచ్చి నామీఁద నావహించి
కటము లదరించె మొగ మెఱ్ఱఁగా నొనర్చె, బొమలు ముడివెట్టె ముకుపుటంబులు గదల్చె.34

వ. అంత.35

సీ. తాపసవటులకుఁ దరవాయిఁ జదివించు భాష్య మల్లంతటఁ బాఱ వైచి

కొమ్మున నంగంబుఁ గోకి చెంగట మేఁత లడుగు జింకను నుల్కిపడ నదల్చి
హరపూజ కంబుపర్ణాదులు గొనితెచ్చు నెదుటిశిష్యులను నేమేమొ తిట్టి
యాగమవాదమాధ్యస్థ్యంబు గోరు ప్రవీణసూరిశ్రేణి వెక్కిరించి
కళవసం బూడ జలకమండలువు వీడ, జడలు మహి జీరఁ జేజపసరము జాఱ
దర్భముడి వ్రేల ధ్యానతత్వంబు సోలఁ, గడిగి నిలుచుండి యాగ్రహగ్రహముఁ జెంది.36